వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ కాల్పుల్లో నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: పాకిస్థాన్‌ తన కుటిల బుద్ధిని మార్చుకోవడం లేదు. మరోసారి కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించి అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాక్‌ రేంజర్లు.. భారత జవాన్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు అమరులయ్యారు.

సాంబా జిల్లాలోని రామ్‌గఢ్‌ సెక్టార్‌లో గల అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మంగళవారం రాత్రి పాక్‌ రేంజర్స్‌ కాల్పులు జరిపారని సరిహద్దు భద్రతా దళం ఐజీ రామ్‌ అత్వార్‌ తెలిపారు. ఈ ఘటనలో నలుగురు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అసిస్టెంట్‌ కమాండెంట్‌ ర్యాంక్‌ అధికారి కూడా ఉన్నారు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.

4 BSF personnel martyred after Pakistan violates ceasefire

తొలుత పాక్‌ సైన్యం కాల్పులకు పాల్పడిందని.. వారి చర్యను భారత బలగాలు తిప్పికొట్టాయని అధికారులు చెప్పారు. మంగళవారం రాత్రి నుంచి మొదలైన కాల్పులు బుధవారం తెల్లవారుజాము వరకు కొనసాగాయని బీఎస్‌ఎఫ్‌ అధికారులు వెల్లడించారు.

English summary
Four personnel of the BSF (Border Security Force) have lost their lives following a ceasefire violation by Pakistan. The incident took place in the Chambliyal sector of Samba.
Read in English: 4 BSF personnel martyred
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X