కాల్పులకు తెగబడ్డ మావోయిస్టులు: నలుగురు పోలీసులు మృతి
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలోని లతేహర్ జిల్లాలో దారుణానికి తెగబడ్డారు. నక్సల్స్ జరిపిన దాడిలో నలుగురు పోలీసులు మృతి చెందారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
శబరిమల భక్తులు అర్బన్ నక్సల్స్ : కేంద్రమంత్రి మురళీధరన్ వివాదాస్పద వ్యాఖ్యలు
శుక్రవారం రాత్రి చంద్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని లుకియతాండ్ గ్రామం సమీపంలో పెట్రోల్ వ్యాన్పై సాయుధులైన మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో అసిస్టెంట్ సబ్ఇన్ స్పెక్టర్ కూడా ఉన్నారు.
మృతుల్లో ఏఎస్ఐ సుక్రా ఓరయన్, హోంగార్డ్ జవాన్లు సికందర్ సింగ్, జమున ప్రసాద్, శంభు ప్రసాద్ ఉన్నారని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనపై జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మావోయిస్టుల దాడిని తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
ఈ దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో కూంబింగ్ చేపడుతున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మావోయిస్టులు ఇలా దాడులకు పాల్పడటంతో ఆ ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది.