హస్టల్ విద్యార్థినిలకు గర్భం....! అసలేం జరిగిందంటే...!
ఒరిస్సాలో గిరిజన హస్టల్స్లో చదువుకునే విద్యార్థులు గర్భం దాల్చారు..భువనేశ్వర్లోని గిరిజన సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలల్లో ఈ ఘోరం జరిగింది..మొత్తం రెండు హాస్టళ్లలో నలుగురు విద్యార్థులు గర్భం దాల్చినట్టు నివేదికలు రూపోందించారు....దీంతో సంఘటనపై జిల్లా మహిళ సంక్షేమ కమిటి పోలీసులకు పిర్యాధు చేశారు...
ఇటివల ఒరిస్సాలో మారుప్రాంతాల వసతి గృహాల్లో విద్యార్థులు గర్భం దాల్చుతున్న సంఘటనలు జరుగుతున్నాయి..దీంతో వెసవి సెలవుల తర్వాత స్కూళ్లోకి చేరిన విద్యార్థినిలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఖుర్థ కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు..దీంతో పలువురు విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసిన వైద్య సిబ్బందికి షాక్ తగిలింది..భువనేశ్వర్ ప్రాంతంలో ఉన్న రెండు వసతి గృహాల్లో నలుగురు విద్యార్థులు గర్భం దాల్చినట్టు తెలిపారు..దీంతో విషయాన్ని తెలుసుకున్న జిల్లా మహిళ సంక్షేమ కమిటి వెంటనే స్పందించి పోలీసు కమిషనర్కు పిర్యాధు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు..విద్యార్థుల రిపోర్ట్ను పరిశీలించిన అనంతరం మరోసారి వారికి వైద్య పరీక్షలు నిర్వహింప చేస్తామని పోలీస్ కమీషనర్ మహంతి తెలిపారు.