నలుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. పుల్వామా జిల్లా లాసీపొర ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య సోమవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు జరిగిగాయి. ఈ ఘటనలో నలుగురు లష్కరే తొయిబా ఉగ్రవాదులు హతమయ్యారు.
లాసీపొర ప్రాంతంలో టెర్రరిస్టులు దాగి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. సీఆర్పీఎఫ్ జవాన్లు, స్థానిక పోలీసులు ముమ్మురంగా తనిఖీలు చేపట్టారు. ఇది గమనించిన ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులు ప్రారంభించారు. వెంటనే భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపి ఉగ్రవాదుల దాడిని తిప్పికొట్టాయి. నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ముష్కరుల దాడిలో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలంలో రెండు ఏకే రైఫిల్స్, ఒక ఎస్ఎల్ఆర్, తుపాకీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కూలిన మిగ్.. సరిహద్దులకు సమీపంలో ఘటన: మూడునెలల్లో తొమ్మిదోసారి
Jammu & Kashmir: 4 terrorists of Lashkar-e-Taiba (LeT) killed in an encounter with security forces in Lassipora area of Pulwama District. Identities yet to be ascertained. 2 AK rifles, 1 SLR & 1 pistol recovered. Search operation underway. (Visuals deferred by unspecified time) pic.twitter.com/hWerZnRXzr
— ANI (@ANI) April 1, 2019