ఉజ్జయినిలో కదులుతున్న బస్సులో అత్యాచారం
ఉజ్జయిని: నర్సరీ చదువుతున్న నాలుగేళ్ల విద్యార్ధినిపై స్కూల్ బస్సు కండెక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. కదులుతున్న బస్సులోనే చిన్నారిపై అత్యాచారం చేసిన ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే మంగళవారం సాయంత్రం స్కూల్ విద్యార్ధులను ఇంటి వద్ద దింపేందుకు బస్సులో ఎక్కారు. అలా ఎక్కిన విద్యార్ధులను తమ తమ ఇళ్ల వద్ద బస్సులో నుంచి దింపివేయగా, చివరకు బస్సులో విద్యార్ధులంతా దిగిన తర్వాత బాధిత బాలిక మాత్రమే మగిలింది.
ఆ సమయంలో బస్సులో ఉన్న కండెక్టర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాధిత బాలికను ఇంటి దగ్గర దింపారు. ఇంటికి వెళ్లిన వెంటనే ఆ చిన్నారి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు బస్సు కండెక్టర్ను అరెస్ట్ చేశారు. నిందితుడిని మహేశ్ భాగవాన్గా పోలీసులు గుర్తించారు.