మహిళపై ఆరుగురు పదే పదే రేప్: ప్రైవేట్ పార్ట్లో రాడ్ దూర్చారు
భోపాల్: మధ్యప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. మహిళపై ఆరుగురు సామూహిక అత్యాచారం చేశారు. పదేపదే మహిళ మీద దాడి చేశారు. ఆమె సున్నితమైన భాగాలలో ఇనుపరాడ్ లు దూర్చారు. బాధితురాలు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నదని పోలీసులు అన్నారు.
ఢిల్లీ లో యువతి మీద బస్సులో గ్యాంగ్ రేప్ (నిర్బయ) చేసి ఏ విధంగా ప్రవర్థించారో అదే విధంగా జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లా పోహ్రి గ్రామంలో 40 సంవత్సరాల మహిళ నివాసం ఉంటోంది.
ఈమె చేతబడి చేస్తున్నదని గ్రామస్తులు అనుమానం పెంచుకున్నారు. పదేపదే పూజలు చేస్తుంటుందని, అందుకే గ్రామంలో చాల మంది నిత్యం ఆనారోగ్యానికి గురి అవుతున్నారని స్థానికులు భావించారు. అంతే ఆమె మీద కక్ష పెంచుకున్నారు.
ఆదివారం రాత్రి మహిళ మీద ఆరుగురు పదేపదే అత్యాచారం చేశారు. చివరికి ఇనుపరాడ్ తీసుకుని ఆమె సున్నితమైన భాగంలో దూర్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.
సున్నితమైన ప్రాంతంలో ఇనుపరాడ్ దూర్చడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు అన్నారు. మహిళ మీద అత్యాచారం చేసిన ఆరుగురిని అరెస్టు చేశామని, కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.