ఆ 44ఖాతాల్లో రూ.100కోట్లు.. షాక్ తిన్న అధికారులు
ఢిల్లీలోని చాందిని చౌక్ లో ఉన్న యాక్సిస్ బ్యాంకులో అక్రమంగా తెరిచిన 44ఖాతాల్లో దాదాపు రూ.100కోట్లు డిపాజిట్ అయినట్టు తేలడంతో అధికారులే షాక్ తిన్నారు.
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో నల్లకుబేరులు వివిధ మార్గాల ద్వారా బ్లాక్ మనీని వైట్ గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో కొంతమంది బ్యాంకర్లను తమకు అనుకూలంగా మలుచుకుని తమ పనులను చక్కబెట్టుకుంటున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.
తాజాగా ఢిల్లీలోని చాందిని చౌక్ లో ఉన్న యాక్సిస్ బ్యాంకులో అక్రమంగా తెరిచిన 44ఖాతాలను అధికారులు గుర్తించారు. వీటిలో దాదాపు రూ.100కోట్లు డిపాజిట్ అయినట్టు తేలడంతో అధికారులు షాక్ తిన్నారు. ఇవిగాక బ్యాంకులోని వివిధ ఖాతాల్లో మొత్తం రూ.450కోట్ల వరకు జమ అయినట్టుగా అధికారులు గుర్తించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాతనే ఈ డబ్బంతా ఆ ఖాతాల్లోకి వచ్చి చేరినట్టు అధికారులు నిర్దారించారు.
కేవిసీ నిబంధనలకు విరుద్దంగా ఈ అక్రమ ఖాతాలు తెరిచినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అంత భారీ మొత్తంలో డబ్బును ఎవరు డిపాజిట్ చేసుంటారు? అన్న విషయం మీద కూపీ లాగుతోన్న అధికారులు.. కొంతమంది బ్యాంకు అధికారులను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
m.s:పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో నల్లకుబేరులు వివిధ మార్గాల ద్వారా బ్లాక్ మనీని వైట్ గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో కొంతమంది బ్యాంకర్లను తమకు అనుకూలంగా మలుచుకుని తమ పనులను చక్కబెట్టుకుంటున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.