వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహరాష్ట్రలో రైలు ప్రమాదం: తప్పిన ప్రాణనష్టం

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో రైలు ప్రమాదం జరిగిన మరునాడే మహరాష్ట్రలో మరో ప్రమాదం చోటుచేసుకొంది. కుర్లా అంబర్ నాథ్ లోకల్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఐదు బోగీలు ట్రాక్ నుండి దూరంగా వెళ్ళాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

మహారాష్ట్ర :మహారాష్ట్రలోని లోకల్ ఇవాళ తెల్లవారుజామున పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే ఈ లైన్ ప్రయాణించే రైళ్ళన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి.ట్రాక్ మరమత్తులను యుద్ద ప్రాతిపదికన చేపట్టారు అధికారులు.

కుర్లా అంబర్ నాథ్ రైలు ఇవాళ తెల్లవారుజామున కళ్యాణ్ విఠల్ వాడీ ప్రాంతంలో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో రైలుకు చెందిన 5 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.

5 coaches of kurla ambernath local train derail near kalyan in maharashtra

పట్టాలు తప్పడంతో కళ్యాణ్. కర్జాత్ మార్గంలో రైళ్ళ రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఈ మార్గంలో రైళ్ళ రాకపోకలను నిలిపివేశారు.అయితే ఐదు బోగీలు పట్టాలు తప్పినా ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకొన్నారు.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో రైలు ప్రమాదం జరిగిన మరునాడే మహారాష్ట్రలో ఈ రైలు ప్రమాదం చోటుచేసుకొంది. అయితే మహారాష్ట్ర రైలు ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు చెబుతున్నారు.ట్రాక్ మరమ్మత్తు పనులను కొనసాగిస్తున్నారు.

English summary
in an unfortunate incident, a Kurla-Ambernath train has derailed near Kalyan near Maharashtra. according to reports, 5 coaches of Kurla-Ambernath local derailed between Kalyan-Vitthalwadi at today morning 5.50 am.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X