నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన ట్రక్కు: 5గురు మృతి
కపుర్తాల: పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఐదుగురు వ్యక్తులపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదం కపుర్తల ప్రాంతంలోని గోయింద్వాల్ రోడ్డుపై సోమవారం ఉదయం చోటుచేసుకుంది.
సోమవారం ఉదయం 6 గంటల వరకూ మృతదేహాలు రోడ్డుపక్కన పడి ఉండడంతోస్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించగా మృతుల్లో నలుగురు మహిళలున్నట్లు గుర్తించారు. మృతులందరూ ఖీరవలి గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు.
ఇది ఇలా ఉండగా, మరో ప్రమాద ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పంజాబ్ ఆర్టీసీ బస్సు ఓ స్కూటర్ను ఢీకొట్టింది. ఆ స్కూటర్ను బస్సు దాదాపు 50మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. దీంతో స్కూటర్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ దారుణ ఘటన ఛండీఘర్లో చోటు చేసుకుంది.