వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన ట్రక్కు: 5గురు మృతి

|
Google Oneindia TeluguNews

కపుర్తాల: పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఐదుగురు వ్యక్తులపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదం కపుర్తల ప్రాంతంలోని గోయింద్వాల్‌ రోడ్డుపై సోమవారం ఉదయం చోటుచేసుకుంది.

సోమవారం ఉదయం 6 గంటల వరకూ మృతదేహాలు రోడ్డుపక్కన పడి ఉండడంతోస్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించగా మృతుల్లో నలుగురు మహిళలున్నట్లు గుర్తించారు. మృతులందరూ ఖీరవలి గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు.

5 crushed to death, 4 injured by speeding truck in Kapurthala

ఇది ఇలా ఉండగా, మరో ప్రమాద ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పంజాబ్ ఆర్టీసీ బస్సు ఓ స్కూటర్‌ను ఢీకొట్టింది. ఆ స్కూటర్‌ను బస్సు దాదాపు 50మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. దీంతో స్కూటర్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ దారుణ ఘటన ఛండీఘర్‌లో చోటు చేసుకుంది.

English summary
It was a sad morning for the region as five residents of Khiranwali village of Kapurthala district were crushed to death after an unidentified truck ran over them on Kapurthala-Goindwal Sahib road on early Monday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X