17 ఏళ్ల మైనర్ బాలికపై ఐదుగురి గ్యాంగ్ రేప్... గన్తో బెదిరించి,బాయ్ఫ్రెండ్ను కట్టేసి...
జార్ఖండ్లోని జంషెడ్పూర్లో దారుణం వెలుగుచూసింది. 17 ఏళ్ల బాలికపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం... మంగళవారం రాత్రి జంషెడ్పూర్లోని బాగ్బెరా ప్రాంతంలో ఓ బాలిక తన బాయ్ఫ్రెండ్తో కలిసి బయటకెళ్లింది. ఆ సమయంలో ఐదుగురు వ్యక్తులు ఆ జంట వద్దకు వచ్చి గన్తో బెదిరించారు. బలవంతంగా ఆ యువతిని,ఆమె బాయ్ఫ్రెండ్ని కలియదిహ్ గౌశాలకు తీసుకెళ్లారు. అక్కడ ఆమె బాయ్ఫ్రెండ్ని తాళ్లతో కట్టి పడేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
బాలిక ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తమిళ్ వానన్ తెలిపారు. తాను డ్యాన్స్ క్లాస్ వెళ్లి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు తనను కిడ్నాప్ చేశారని మొదట ఆ బాలిక ఫిర్యాదు చేసిందన్నారు. కానీ విచారణలో బాయ్ఫ్రెండ్తో కలిసి బయటకు వెళ్లినట్లు గుర్తించామన్నారు.
నిందితులను శంకర్ తియు,రోషన్ కుజుర్,సూరజ్ పాత్రో,సన్నీ సొరెన్గా గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. నిందితుల్లో ఒకరు మైనర్ అని తెలిపారు. వారి వద్ద నుంచి ఒక గన్తో పాటు రెండు బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మైనర్ బాలుడిని జువైనల్ హోమ్కి తరలించి... మిగతా ముగ్గురు నిందితులను జైలు రిమాండ్కు తరలించినట్లు చెప్పారు.
Recommended Video
ఉత్తరప్రదేశ్లో జరిగిన హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై దేశమంతా భగ్గుమంటున్నా మహిళలపై నేరాలు మాత్రం ఆగట్లేదు. దేశంలో నిత్యం ఎక్కడో చోట మహిళలు అత్యాచారాలు,నేరాలకు గురవుతూనే ఉన్నారు. 2019 నేషనల్ క్రైమ్ బ్యూరో లెక్కల ప్రకారం ప్రతీ 16 నిమిషాలకో భారత్లో ఒక అత్యాచార ఘటన జరుగుతోంది. ప్రతీ రోజూ 88 మంది మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. నిర్భయ లాంటి కఠిన చట్టాలు తీసుకొచ్చిన కామాంధుల్లో మార్పు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.