ఎటిఎంలలో ఇకనుండి 50 రూపాయాల నోట్లు
ముంబై :పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా చిల్లర కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఎటిఎంలలో చిన్న నగదు నోట్లను పెట్టాలని ఆర్ బి ఐ బ్యాంకులను ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం నాడు తెరుచుకోనున్న ఎటిఎంలలో 50 రూపాయాల నోట్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
పెద్ద నగదు నోట్లను రద్దు చేయడం వల్ల చిన్న నగదు కోసం ప్రజలు రెండు రోజుల నుండి ఇబ్బందిపడుతున్నారు.ఎటిఎం లు రెండు రోజులుగా బంద్ చేశారు. శుక్రవారం నాడు ఎటిఎం లు తెరుచుకోనున్నాయి.
రెండు రోజుల తర్వాత తెరుచుకోనున్న ఎటిఎ:లలో చిన్న నగదు నోట్లను ఏర్పాటు చేయనున్నారు.ప్రజలకు ఏర్పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఎటిఎంలలో 50 లేదా వంద రూపాయాలను అందుబాటులోకి రానున్నాయి.
బ్యాంకుల ద్వారా ఇప్పటికే రద్దు చేసిన పెద్ద నగదు నోట్లను మార్పిడి చేసుకొనే ప్రక్రియ గురువారం నుడి ప్రారంభమైంది. బ్యాంకుల వద్ద పెద్ద నోట్ల మార్పిడికి ఖాతాదారులు బారులు తీరుతున్నారు.చిన్న నగదు నోట్ల కోసం కమీషన్ వ్యాపారులను ఆశ్రయించిన వారికి ఆర్ బి ఐ తీసుకొన్న నిర్ణయం ఉపశమనం కల్గించనుంది.శుక్రవాంం నుండి తమకు కావాల్సిన నగదును ఎటిఎంల నుండి డ్రా చేసుకోవచ్చు అయితే రెండువేల రూపాయాల వరకే నగదును డ్రా చేసుకోనే వెసులు బాటు ఉంది.