వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ లోకి చొరబడేందుకు సిద్ధంగా 50 మంది పాక్ ఉగ్రవాదులు -ఐబీ నివేదిక, అప్రమత్తత

|
Google Oneindia TeluguNews

చలికాలంలో వాతావరణాన్ని అవకాశంగా తీసుకొని, భారత్ లోకి చొరబడి విధ్వంసం జరిపేలా పాకిస్తాన్ టెర్రరిస్టులు సమాయత్తం అవుతున్నారు. భార‌త భూభాగంలోకి చొర‌బ‌డేందుకు వీలుగా నియంత్ర‌ణ రేఖ(ఎల్ఓసీ) వెంబ‌డి వివిధ లాంచ్ ప్యాడ్ల వ‌ద్ద 50 మంది ఉగ్ర‌వాదులు సిద్ధంగా ఉన్న‌ట్లు ఆర్మీ వ‌ర్గాలు తెలిపాయి.

పదవితోపాటే మూడో పెళ్లీ పెటాకులు -ట్రంప్‌కు మెలానియా విడాకులు -వైట్‌హౌజ్ సహాయకురాలి క్లెయిమ్పదవితోపాటే మూడో పెళ్లీ పెటాకులు -ట్రంప్‌కు మెలానియా విడాకులు -వైట్‌హౌజ్ సహాయకురాలి క్లెయిమ్

పాకిస్తాన్ సైన్యం దగ్గరుండి మరీ శిక్షణ అందించి, పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను కాశ్మీర్‌లోకి ప్ర‌వేశ‌పెట్టేందుకు కుట్రలు చేస్తోందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తాజా నివేదిక పేర్కొంది. ఆదివారం వెల్లడైన ఈ నివేదిక ప్రకారం.. జమ్మూ కాశ్మీర్‌లోని మచిల్ సెక్టార్ ఎదురుగా ఉన్న కంట్రోల్ లైన్ (ఎల్‌ఓసి) మీదుగా లాంచ్ ప్యాడ్‌లలో 50 మంది ఉగ్రవాదులు క్యాంప్ వేసిన‌ట్లు తెలిసింది.

50 terrorists waiting at launch pads across LoC to infiltrate into India

ల‌ష్క‌రే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్ర‌సంస్థ‌ల‌తో సంబంధం ఉన్న 50 మంది ఉగ్ర‌వాదులు కెల్, తేజియాన్, సర్దారీ లాంచ్ ప్యాడ్‌లలో మాటువేసిన‌ట్లుగా ఐబీ వెల్ల‌డించింది. ఈ ఉగ్రవాదులకు భారత్‌లోకి చొప్పించి దాడులకు పాల్పడటం ద్వారా అశాంతిని రేకెత్తించాలన్నదే పాక్ పన్నాగమని పేర్కొంది.

 చైనా మరో సంచలనం: ఆర్థికంగా దెబ్బతీస్తామని వార్నింగ్ - మలబార్ విన్యాసాలపై డ్రాగన్ బుసబుస చైనా మరో సంచలనం: ఆర్థికంగా దెబ్బతీస్తామని వార్నింగ్ - మలబార్ విన్యాసాలపై డ్రాగన్ బుసబుస

చొరబాటుకు 50 మంది ఉగ్రవాదులు సిద్దంగా ఉన్నారన్న ఐబీ హెచ్చరికతో భారత సైనిక వర్గాలు అప్రమత్తం అయ్యాయి. చొర‌బాటుదారుల‌ను విజ‌యవంతంగా అడ్డుకుంటోన్న భారత బలగాలు.. ఉగ్ర‌వాదుల కుట్ర‌ను భ‌గ్నం చేయడంలో విజయం సాధిస్తున్నాయి. ఇటీవల జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ సహా ముగ్గురు ఉగ్ర‌వాదులు ఖతం చేసింది.

English summary
Pakistan Army is conspiring to push large groups of terrorists into Kashmir in order to create disturbances, said an intelligence agency report, adding that about 50 terrorists are camping at launch pads across the Line of Control (LoC) opposite Machil sector of Jammu and Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X