సరిహద్దులను దాటుకుని పాక్ గడ్డపై కాలు మోపిన 500 మంది సిక్కులు
న్యూఢిల్లీ: సుమారు 500 మంది సిక్కులు మంగళవారం మధ్యాహ్నం దేశ సరిహద్దులను దాటారు. పాకిస్తాన్ గడ్డపై అడుగు పెట్టారు. గురు నానక్ 550 జయంత్యుత్సవాలను పురస్కరించుకుని వారు పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో గల నాన్కన సాహిబ్ ను సందర్శించబోతున్నారు. ఈ నాన్కన సాహిబ్ లోనే గురు నానక్ జన్మించారు. శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు సర్దార్ గోబింద్ సింగ్ లొంగోవాల్, ఢిల్లీ గురుద్వారా మేనేజ్ మెంట్ కమిటీ ఛైర్మన్ మన్జీందర్ సింగ్ సిర్సా నేతృత్వం వహిస్తున్నారు.
VG Siddhartha Missing: చివరిసారిగా సిద్ధార్థ కనిపించింది ఎక్కడంటే..?
తమ దేశంలో అడుగు పెట్టిన ఈ సిక్కుల ప్రతినిధుల బృందం సభ్యులకు పాకిస్తాన్ సాదర స్వాగతం పలికింది. దౌత్యపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి వారందరికీ ఇదివరకే విసాలాను జారీ చేసినట్లు భారత్ లోని పాకిస్తాన్ రాయబార కార్యలయం అధికారులు వెల్లడించారు.