ఢిల్లీ, పంజాబ్, జమ్మూకాశ్మీర్, నోయిడాలో భూకంపం: భయంతో పరుగులు తీసిన జనం
న్యూఢిల్లీ: ఉత్తరభారతదేశంలో శుక్రవారం రాత్రి ఒక్కసారిగా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో రిక్టారు స్కేలుపై 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అంతేగాక, ఢిల్లీ-ఎన్సీఆర్, జమ్మూకాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది.
ఇప్పటి వరకైతే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలంతా భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలు సెకన్లపాటు భూమి కంపించిందని పలువురు తెలిపారు. ఇళ్లల్లోని వస్తువులు స్వల్పంగా కదలాడాయని చెప్పారు.
ఆఫ్ఘనిస్థాన్, నేపాల్లోని హిందూఖుష్ పర్వతాల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు సమాచారం. హిందుఖుష్ పర్వతాల కారణంగానే తరచూ భూకంపాలు సంభవిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, పాకిస్థాన్లోని పలు ప్రాంతాల్లో కూడా శుక్రవారం రాత్రి భూకంపం సంభవించింది. కజకిస్థాన్లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.
6.4 skeler earth quack in delhi ncr
— Vinay Kumar Shukla (@vinayshukla212) February 12, 2021
I pray for everybody's saftey 🙏 #earthquake pic.twitter.com/ZYF10ZaLz5
జాతీయ రాజధాని భూకంప జోన్ IV క్రిందకు వస్తుంది - ఇది చాలా ఎక్కువ రిస్క్ జోన్. భూకంపాల పెరుగుతున్న తీవ్రత, పౌన:పున్యం ప్రకారం భారతదేశం II, III, IV, V - నాలుగు భూకంప మండలాలుగా విభజించబడింది.
ఢిల్లీలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయని, అందరూ సుక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
Not since the earthquake of 2005 have the tremors in Srinagar been bad enough to force me out of the house. I grabbed a blanket & ran. I didn’t remember to take my phone & so was unable to tweet “earthquake” while the damn ground was shaking.
— Omar Abdullah (@OmarAbdullah) February 12, 2021
2005 తర్వాత ఇక్కడ భూకంపం సంభవించిందని, భయంతో తాను ఒక బ్లాంకెట్ తీసుకుని బయటకు పరుగుతీశానని జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్టర్ లో వెల్లడించారు. ఆ తొందరలో తాను ఫోన్ కూడా తీసుకోకుండా పరుగు తీసినట్లు చెప్పారు.