వాయుసేన స్థావరాలపై భారీ దాడికి లష్కరే కుట్ర.. హై అలర్ట్ ప్రకటన!
ఉత్తరప్రదేశ్లోని వాయుసేన స్థావరాలపై పెద్ద ఎత్తున దాడి జరిపేందుకు లష్కరే తొయిబా ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.
లక్నో: ఉత్తరప్రదేశ్లోని వాయుసేన స్థావరాలపై పెద్ద ఎత్తున దాడి జరిపేందుకు లష్కరే తొయిబా ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. యూపీలోని భారత్-నేపాల్ సరిహద్దు వెంబడి హైఅలర్ట్ ప్రకటించింది.
ఆరు నుంచి ఏడుగురు లష్కరే ఉగ్రవాదులు వాయిసేన స్థావరాలను, ముఖ్యంగా ఘజియాబాద్లోని హిండన్ వద్దనున్న ఐఎఎఫ్ స్థావరంపై దాడికి కుట్ర పన్నినట్టు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 'రా' (ఇంటెలిజెన్స్ అండ్ అనాలసిస్ వింగ్) ఓ నివేదికలో హెచ్చరించింది.
బుధవారం ఉదయం ఘజియాబాద్లోని వాయిసేన హిండన్ బేస్ గోడను దాటేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించడంతో భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఆ వ్యక్తి గాయపడ్డాడు. అయితే ఈ ఘటనకూ, ఇంటెలిజెన్స్ నివేదికకూ సంబంధం ఎదైనా ఉందా? అనేది ఇంకా తెలియలేదు.
లష్కరే ఉగ్రవాదులు ఏకే 47 రైఫిల్స్, గ్రనేడ్ లాంఛర్లు, హ్యాండ్ గ్రనేడ్లతో దాడులు జరపవచ్చని ఇంటెలిజెన్స్ నివేదిక హెచ్చరించింది. కాగా, 'రా' ఇచ్చిన సమాచారాన్ని ఇంటెలిజెన్స్ బ్యూరో నిశితంగా పరిశీలిస్తోంది.