వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిల్లాడిని తప్పించబోయి చెరువలో పడిన కారు: ఆరుగురు చిన్నారుల మృతి

|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న ఓ పిల్లాడిని కాపాడేందుకు డ్రైవర్ చేసిన ప్రయత్నం ఆరుగురు చిన్నారులను బలితీసుంది. మంగళవారం ఉదయం అరారియా జిల్లాలో ఈ ఘోరం చోటుచేసుకుంది.

ప్రమాదానికి గురైన స్కార్పియో కారులో చిన్నారులతో పాటు మరో నలుగురు పెద్దలు కూడా ఉన్నారు. బాధితులంతా ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

6 children die in Bihar’s Araria after car falls into pond

దబ్రా గ్రామం సమీపంలోకి రాగానే ఓ చెట్టును ఢీకొట్టడంతో కారుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో కారు నేరుగా ఓ చెరువులో పడిపోయింది. మొత్తం ఆరుగురు పిల్లలు అక్కడికక్కడే చనిపోగా... మిగతా వారిని హుటాహుటిన ఆరారియాలోని ఓ ఆస్పత్రికి తరలించారు.

రోడ్డు దాటుతున్న ఓ పిల్లాడిని తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించాడనీ.. అయితే కారు రోడ్డుపక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టడంతో నియంత్రణ కోల్పోయాడని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది.

English summary
Six children were killed when a sports utility vehicle (SUV) in which they were travelling hit a tree and fell into a pond in Bihar’s Araria district on Tuesday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X