వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పిల్లాడిని తప్పించబోయి చెరువలో పడిన కారు: ఆరుగురు చిన్నారుల మృతి
పాట్నా: బీహార్ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న ఓ పిల్లాడిని కాపాడేందుకు డ్రైవర్ చేసిన ప్రయత్నం ఆరుగురు చిన్నారులను బలితీసుంది. మంగళవారం ఉదయం అరారియా జిల్లాలో ఈ ఘోరం చోటుచేసుకుంది.
ప్రమాదానికి గురైన స్కార్పియో కారులో చిన్నారులతో పాటు మరో నలుగురు పెద్దలు కూడా ఉన్నారు. బాధితులంతా ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
దబ్రా గ్రామం సమీపంలోకి రాగానే ఓ చెట్టును ఢీకొట్టడంతో కారుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో కారు నేరుగా ఓ చెరువులో పడిపోయింది. మొత్తం ఆరుగురు పిల్లలు అక్కడికక్కడే చనిపోగా... మిగతా వారిని హుటాహుటిన ఆరారియాలోని ఓ ఆస్పత్రికి తరలించారు.
రోడ్డు దాటుతున్న ఓ పిల్లాడిని తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించాడనీ.. అయితే కారు రోడ్డుపక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టడంతో నియంత్రణ కోల్పోయాడని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది.
Comments
English summary
Six children were killed when a sports utility vehicle (SUV) in which they were travelling hit a tree and fell into a pond in Bihar’s Araria district on Tuesday morning.
Story first published: Tuesday, June 19, 2018, 15:04 [IST]