వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీలో దారుణం.. బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు దుర్మరణం

Array

|
Google Oneindia TeluguNews

అనధికార బాణసంచా తయారీ కారణంగా ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. అనేక మంది గాయాలపాలయ్యారు. దీపావళి సమీపిస్తుండటంతో అనేక మంది అనధికారికంగా బాణసంచా తయారీ లో నిమగ్నం అయ్యారు. అధికారుల నిఘా లోపించటంతో వీరు యధేచ్చగా అక్రమంగా బాణసంచా తయారు చేస్తూ అనేక మంది ప్రాణాలు పోవటానికి కారణమవుతున్నారు. ఉత్తప్రదేశ్ లోని మిరేచీ టౌన్ లోని టకియా ప్రాంతంలో ఇటవంటి దుర్ఘటనే చోటు చేసుకుంది.

నిరేష్ జాతవ్ అనే వ్యక్తికి చెందిన నివాసంలో అక్రమంగా బాణసంచా తయారు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు. అందులో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ ఇల్లు పూర్తిగా డామేజ్ అయింది. కాగా..ఇంటి శిధిలాల కింద మరి కొంత మంది ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలసులు..స్థానిక అధికారులు సహాయ చర్యలకు రంగంలోకి దిగారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

6 people killed many injured in illegal crackers factory blast in uttarpradesh

జిల్లా మెజిస్ట్రేట్ షుకాల్ భారతీతో పాటుగా సీనియర్ పోలీసు అధికారులు ఘటనా స్థలిలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఘటన పైన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇటువంటి అనుమతులు లేకుండా బాణసంచా తయారు చేస్తున్న వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

English summary
6 people killed many injured in illegal crackers factory blast in uttarpradesh. district majistrate and senior police officials started resque operations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X