వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు అక్కడికక్కడే మృతి... 32 మందికి గాయాలు...

|
Google Oneindia TeluguNews

ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫిలిబిత్ జిల్లాలోని పురాన్‌పూర్ సమీపంలో ఓ బస్సు-ఎస్‌యూవీ వాహనం ఢీకొన్నాయి. శనివారం(అక్టోబర్ 17) తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా... మరో 32 మంది గాయపడ్డారు.

తెల్లవారుజామున 3గం.-4గం. మధ్యలో ప్రమాదం జరిగినట్లు ఫిలిబిత్ ఎస్పీ తెలిపారు. ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితుల్లో ఎక్కువమంది ఫిలిబిత్‌కి చెందినవారేనని తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉండగా... బొలెరో వాహనంలో 10 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదానికి కారణమేంటన్నది ఇంకా తెలియరాలేదు.

 7 Killed, 32 Injured After Lucknow Bus Collides With SUV in Uttar Pradesh

Recommended Video

Fact check:Watch Signal Crossing The Road But It's Not From Hyderabad రోడ్డు దాటుతున్న సిగ్నల్!!

ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదాలు తరుచుగా సంభవిస్తున్నాయి. రెండు రోజుల క్రితం కబ్రాయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ,ఆమె ఏడాది కుమారుడు మృతి చెందారు. కొడుకును ఎత్తుకుని ఆమె రోడ్డు పక్కన నిలుచున్న సమయంలో ఓ ట్రక్కు వీరిని ఢీకొట్టింది. ఇదే ఏడాది మే నెలలో ముజఫర్‌నగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు వలస కార్మికులు మృతి చెందారు.

English summary
At least seven people were killed and 32 injured after a Lucknow-bound bus and an SUV collided in Puranpur area of Pilibhit district in Uttar Pradesh on Saturday.The mishap reportedly took place between 3 am and 4 am in the early hours of Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X