ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు అక్కడికక్కడే మృతి... 32 మందికి గాయాలు...
ఉత్తర ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫిలిబిత్ జిల్లాలోని పురాన్పూర్ సమీపంలో ఓ బస్సు-ఎస్యూవీ వాహనం ఢీకొన్నాయి. శనివారం(అక్టోబర్ 17) తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా... మరో 32 మంది గాయపడ్డారు.
తెల్లవారుజామున 3గం.-4గం. మధ్యలో ప్రమాదం జరిగినట్లు ఫిలిబిత్ ఎస్పీ తెలిపారు. ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితుల్లో ఎక్కువమంది ఫిలిబిత్కి చెందినవారేనని తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉండగా... బొలెరో వాహనంలో 10 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదానికి కారణమేంటన్నది ఇంకా తెలియరాలేదు.
Recommended Video
ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్లో రోడ్డు ప్రమాదాలు తరుచుగా సంభవిస్తున్నాయి. రెండు రోజుల క్రితం కబ్రాయ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ,ఆమె ఏడాది కుమారుడు మృతి చెందారు. కొడుకును ఎత్తుకుని ఆమె రోడ్డు పక్కన నిలుచున్న సమయంలో ఓ ట్రక్కు వీరిని ఢీకొట్టింది. ఇదే ఏడాది మే నెలలో ముజఫర్నగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు వలస కార్మికులు మృతి చెందారు.