వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దైవదర్శనం: రోడ్డు ప్రమాదంలో 7 మంది దుర్మరణం, నిద్రలోకి బస్సు డ్రైవర్ 20 మందికి!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: శ్రీ చౌడేశ్వరిదేవి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో కర్ణాటకలోని తుమకూరు జిల్లా శిరా పట్టణం సమీపంలో ప్రైవేటు బస్సు లారీ ఢీకొనడంతో 7 మంది దుర్మరణం చెంది 20 మందికి తీవ్రగాయాలైనాయి. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు అన్నారు.

శిరా పట్టణంలోని 60 మంది హనుమాన్ ట్రావెల్స్ ప్రైవేటు బస్సులో సింగదూరులోని శ్రీ చౌడేశ్వరిదేవి దర్శనం చేసుకోవడానికి వెళ్లారు. శ్రీ చౌడేశ్వరి దేవి దర్శనం చేసుకుని శిరాకు బయలుదేరారు. సోమవారం వేకువ జామున శిరా పట్టణం సమీపంలోని జాతీయ రహదారిలోని జైహింద్ హోటల్ సమీపంలో వేగంగా వెలుతున్న బస్సు అదుపుతప్పి లారీని ఢీకొనింది.

 7 people were killed in a bus accident newr Shira of tumkur district.

ఈ ప్రమాదంలో అనూష (7), సవితా (21) రత్నమ్మ (350, శంకర్ (35), అశ్వథ్ నారాయణ (50) ,సుమలత (21), గిరిజమ్మ (50) అనే ఏడు మంది దుర్మరణం చెందారు. ఇదే బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి పైగా తీవ్రగాయాలు కావడంతో వారిని తుమకూరు జిల్లా ఆసుపత్రికి, శిరా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

గాయపడినవారిలో చౌడమ్మ. స్నేహ, జయమ్మ, భూతప్ప, భారతి, యశోధ, అన్నపూర్ణేశ్వరి, జ్యోతి, మోహన్ కుమార్ తదితరుల పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. డ్రైవర్ నిద్రలోకి జారుకుని నిర్లక్షంగా బస్సు నడపడం వలనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

English summary
7 people were killed in a bus accident newr Shira of tumkur district. 60 passengers were in the bus. 20 passengers were injured. Bus was travelling to Shira from Siganduru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X