దారుణం: బాలుడిపై అత్యాచారం, కిరోసిన్ పోసి నిప్పింటించారు
భీవండి: మహారాష్ట్రలోని భీవండిలో దారుణం చోటు చేసుకుంది. ఏడేళ్ల బాలుడిపై అత్యాచారం చేసిన దుండగులు, ఆ తర్వాత అతడు అడ్డుకోవడంతో కిరోసిన్ పోసి నిప్పింటించారు. బాలుడు సామూహిక భోజన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.
బాలుడ్ని బలవంతంగా ఎవరూ లేని ప్రాంతంలోకి తీసుకెళ్లి, అక్కడే అతనిపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. తప్పించుకనేందుకు ప్రయత్నించిన బాలుడిపై కిరోసిన్ పోసి నిప్పింటించారు. ఆ తర్వాత అక్కడ్నుంచి నిందితులు పరారయ్యారు.
30శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం బాధిత బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. బాలుడి పరిస్థితి కొంచెం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.
నిందితులపై పలు సెక్షన్ల కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.