ఏడేళ్ళ బాలికపై విధ్యార్థినుల లైంగిక దాడి, అసహజ శృంగారం, చివరికిలా...
ఏడేళ్ల బాలికపై ఇధ్దరు సీనియర్ విధ్యార్థినులు లైంగికంగా వేధించారు. దుస్తులు విప్పేసి అసహజ శృంగారానికి పాల్పడ్డారు. ఈ ఘటన న్యూఢిల్లీలోని ఓ స్కూల్ లో చోటుచేసుకొంది. నెలల తరబడి ఏడేళ్ళ బాలికను సీనియర్లు వే
న్యూఢిల్లీ:దేశ రాజధానిలో మహిళలపై రోజుకో అఘాయిత్యం వెలుగుచూస్తోంది. ప్రతి రోజూ ఏదో ఒక ఘటన ప్రసార సాధనాల్లో పతాక శీర్షికల్లో కన్పిస్తోంది.ఇద్దరు సీనియర్ విధ్యార్థినులు ఏడేళ్ళ బాలికను లైంగికంగా వేధించారు. అసహజ శృంగార కార్యక్రమాలకు పాల్పడ్డారు.
పశ్చిమ డిల్లీలోని మోతీనగర్ లో ఏడేళ్ళ ఓ స్కూల్ విధ్యార్థిని కొన్ని నెలల పాటు లైంగికంగా వేధించారు.నెలల తరబడి సీనియర్ విధ్యార్థినులు ఇద్దరూ లైంగికంగా వేధించడంతో ఆ బాలిక భయాందోళనలకు గురైంది.
చివరకు బాధితురాలు కుటుంబసభ్యులకు చెప్పడంతో అసలు విషయం వెలుగు చూసింది.అయితే ఏడేళ్ల బాలికను లైంగికంగా వేధించిన సీనియర్ విధ్యార్థినుల్లో ఓ మైనర్ కూడ ఉండడం గమనార్హం.
స్కూల్ భోజన విరామ సమయంలో సీనియర్ అమ్మాయిలు బాధితురాలిని ఖాళీగా ఉన్న క్లాస్ రూమ్ లోకి తీసుకెళ్ళి అసభ్యంగా ప్రవర్తించేవారు. బాధితురాలు అడ్డుచెబితే దుస్తులు విప్పి అసహజ శృంగారానికిపాల్పడేవారు. తీవ్ర భయాందోళనలకు గురైన బాలిక చివరకు తల్లిదండ్రులకు విషయాన్ని వివరించింది.
బాధితురాలితో పాటు కుటుంబసభ్యులకు స్కూల్ విధ్యార్థులకు నిపుణులు కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు.అయితే నిందితుల్లో ఓ అమ్మాయిని పోలీసులు అరెస్టు చేశారు. మరో అమ్మాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయమై పోలీసులు స్కూల్ యాజమాన్యాన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.