కొత్త నోట్ల: బ్యాంకు ముందు క్యూలోనే మృతి
బెంగళూరు: రూ.1,000, రూ.500 నోట్లు రద్దు చెయ్యడంతో పాత నోట్లు మార్చుకోవడానికి క్యూలో నిలబడి ఉన్న ఓ వృద్దుడు నీరసంతో కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన కర్ణాటకలోని తుమకూరు పట్టణంలో జరిగింది.
తుమకూరు జిల్లాలోని చేలూరుకు చెందిన సిద్దప్ప (70) అనే ఆయన శనివారం బ్యాంకుల దగ్గర ప్రత్యేకంగా వృద్దులకు మాత్రమే పాత నోట్లు మార్చుకునే అవకాశం ఉందని తెలుసున్నారు. తరువాత తుమకూరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ బ్రాంచ్ దగ్గరకు వెళ్లారు.

ఉదయం నుంచి క్యూలో నిలబడి ఉన్న సిద్దప్ప మద్యాహ్నం 12.30 గంటల సమయంలో క్యూలోనే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సిద్దప్ప మరణించారని వైద్యులు చెప్పారు.
ఉదయం నుంచి క్యూలో ఉండటం వలనే నీరసంతో సిద్దప్ప మరణించారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. సిద్దప్ప మరణించారని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని, కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications