బ్రిటన్ కన్నా ఎక్కువ.. భారత్లో 73కి చేరిన స్ట్రెయిన్ కేసులు..
కరోనా స్ట్రెయిన్.. ఈ పేరు వింటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందడంతో ఆందోళన ఎక్కువవుతోంది. ఇదీ తొలుత బ్రిటన్లో బయటపడగా.. క్రమంగా ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. అయితే బ్రిటన్ కన్నా భారత్లో స్ట్రెయిన్ కేసులు ఎక్కువ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో స్ట్రెయిన్ కేసులు 73కి చేరాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
Recommended Video
స్ట్రెయిన్ వచ్చినవారికి ప్రత్యేకంగా వైద్య సేవలు అందిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. స్ట్రెయిన్ వచ్చిన వారిని క్వారంటైన్ చేశామని వివరించింది. వారితో ప్రయాణించిన వారు/ కుటుంబ సభ్యులు ఇతరులను కూడా గుర్తించే పనిలో ఉన్నారు. స్ట్రెయిన్ వైరస్ వేగంగా వ్యాపించడంతో ఆందోళన నెలకొంది.
బ్రిటన్ సహా డెన్మార్క్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్, జర్మనీ, కెనడా, జపాన్, లెబనాన్, సింగపూర్ దేశాలకు కూడా వైరస్ వ్యాపించింది. బ్రిటన్ నుంచి భారత్ వచ్చిన వారిని గుర్తించి స్ట్రెయిన్ టెన్షన్ను తగ్గించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.