76 మంది సైనికులు కోలుకుంటున్నారు.. వారం రోజుల్లో విధుల్లోకి: అధికారులు
డ్రాగన్ చైనాతో సోమవారం తూర్పు లడాఖ్ గాల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణలో 76 మంది సైనికులు గాయపడ్డారు. వారంతా కోలుకుంటున్నారని.. వారం రోజుల్లో విధుల్లో చేరతారని ఆర్మీ ప్రకటించింది. చైనా ఆర్మీ చేసిన రాళ్ల దాడిలో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.
లేహ్ ఆస్పత్రిలో 18 మంది చికిత్స పొందుతున్నారని.. వారు కోలుకోవడానికి 15 రోజుల సమయం పడుతుందని అధికారులు వివరించారు. మరో 58 మంది వారం రోజుల్లో క్యూర్ అవుతారని పేర్కొన్నారు. వీరికి చిన్న గాయాలు ఉన్నాయని వివరించారు. వారి ఆరోగ్యం గురించి బెంగ అవసరం లేదు అని పేర్కొన్నది.
Recommended Video
భారత్ నుంచి కల్నల్ సహా 20 మంది జవాన్లు చనిపోగా.. చైనాకు చెందిన ఎంతమంది చనిపోయారనే అంశంపై మాత్రం క్లారిటీ లేదు. ఘర్షణలో చనిపోయిన, గాయపడ్డ వారి వివరాలు వెల్లడించామని, ఎవరూ మిస్ కాలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. అయితే గాల్వాన్ లోయ దాడికి సంబంధించి భారత్-చైనా మేజర్ జనరల్స్ మూడో రోజు కూడా చర్చించారు.