వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళలో ఢీకొన్న పడవలు: 8 మంది మృతి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

కొచ్చి: కేరళలో రాజధాని కొచ్చిలో బుధవారం ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ ఘటన మధ్యాహ్నాం 1.45 గంటల ప్రాంతంలో జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న పడవను మత్స్యకారలు వెళ్తున్న పడవ ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ప్రయాణికుల పడవ రెండుగా చీలిపోగా, నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు సహా మొత్తం 8 మంది మృతి చెందారు.

ప్రమాదం జరిగిన సమయంలో 45 మంది వరకూ ప్రయాణికులు పడవలో ఉన్నారు. ప్రమాంద జరిగిన వెంటనే 30 మంది ప్రయాణికులను రక్షించి కొచ్చి తాలుకూ ఆసుపత్రి, ఎర్నాకుళం మెడికల్ ట్రస్ట్ ఆసుపత్రికి మరికొందరిని తరలించి చికిత్సనందిస్తున్నారు.

8 killed as boat capsizes off Fort Kochi

ప్రయాణికుల పడవ ఫెర్రీ పోర్డ్ నుంచి వ్యాపిన్ వెళుతుండగా, మార్గమధ్యంలో అదుపుతప్పిన మత్స్యకారుల పడవ ఒకటి బలంగా ఢీకొన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

కోస్టుగార్డు సిబ్బంది, ఫైర్ సిబ్బందితో పాటు స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను వెలికి తీస్తున్నారు.

English summary
Eight people, including four women and two children, died after a boat carrying about 45 passengers capsized off Fort Kochi on Wednesday. The boat was on its way to Vypeen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X