వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవుడి గదిలో దీపం కిందపడి బాలిక సజీవదహనం, తల్లిదండ్రులు, అర్దరాత్రి దారుణం !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: దేవుడి గదిలో ఉన్న దీపం కింద పడి బాలిక సజీవదహనం అయిన సంఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లాలో జరిగింది. తీవ్రగాయాలైన బాలిక తల్లిదండ్రులు బెళకవాడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఈ విదంగా ఉన్నాయి.

బెళగావి జిల్లాలోని బెళకవాడిలో కస్తూరి (8) అనేక బాలిక నివాసం ఉంటున్నది. సోవారం రాత్రి కస్తూరి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసింది. కస్తూరి తల్లి దేవుడి గదిలో దీపం వెలిగించింది. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన కస్తూరి ఇంటిలో నిద్రపోయింది.

Recommended Video

మైనర్ బాలిక పెళ్లి .. అడ్డుకొన్న అధికారులు
8 year-old girl Kasthuri burnt to death in her home in Belagavi,

రాత్రి పొద్దుపోయిన తరువాత దేవుడి గదిలో ఉన్న దీపం కిందపడంతో మంటలు కస్తూరి నిద్రపోతున్న పరుపుకు అంటుకున్నాయి. అయితే మంటలు వ్యాపించిన విషయం కస్తూరి గుర్తించలేకపోయింది. మంటలు పరుపుతో పాటు కస్తూరి కప్పుకున్న దుప్పటికి, బట్టలకు వ్యాపించడంతో సజీవదహనం అయ్యింది. కస్తూరి కుటుంబ సభ్యులకు మంటలు వ్యాపించడంతో వారికి తీవ్రగాయాలైనాయి.

కస్తూరి కుటుంబ సభ్యులు కేకలు వెయ్యడంతో చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారు వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. కస్తూరి తల్లిదండ్రులకు తీవ్రగాయాలైనాయని, వారి పరిస్థితి విషమంగా ఉందని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.

English summary
8 year-old girl Kasthuri burnt to death in her home in Belagavi, her parents are survived, admitted into hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X