క్రైమ్ షోను కాపీ చేస్తూ బాలిక ఉరేసుకుంది: భయంతో మిత్రుల పరార్
లక్నో: పొరపాటున ఉరిపడి 8 ఏళ్ల బాలిక మరణించింది. టెలివిజన్లో ప్రసారమవుతున్న ఓ క్రైమ్ షోతో ప్రేరణ పొంది మిత్రురాలి ఇంటిలో ఉరి వేసుకున్నట్లు నటించేందుకు ప్రయత్నించింది. అయితే, ఉరి బిగుసుకోవడంతో ఆమె మరణించింది.
ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హపూర్లో మంగళవారం రాత్రి జరిగింది. ఆమె మిత్రులు ఎవరినీ అప్రమత్తం చేయకుండా భయంతో పారిపోయారు. ఇంట్లో దెబ్బలు కొట్టడతో ఏడుస్తూ ఆమె తమ ఇంటికి వచ్చిందని, టీవీలో తాము ఓ క్రైమ్ షో చూశామని, దాంతో పోలీసు - పోలీసు ఆట ఆడాలని నిర్ణయించుకున్నామని, ఆటాడుతుండగా ఆమె ఉరివేసుకుందని స్నేహితురాలు పోలీసులతో చెప్పింది.
ఇంట్లో తీవ్ర అసంతృప్తికి గురైన బాలిక ఆడుకోవడానికి పొరుగింటికి వచ్చిందని కేసును దర్యాప్తు చేస్తున్న అధికారి చెప్పారు. టీవీలో పాపులర్ క్రైమ్ షోలో ఉరి వేసుకున్న దశ్యాన్ని చూశారని చెప్పారు.
పిల్లలను దాన్ని అనుకరించడానికి ప్రయత్నించారని, బాలిక బకెట్పైకి ఎక్కి దుపట్టాను మెడ చుట్టూ కట్టుకుని ఉరేసుకుందని చెప్పారు. బాలిక మరణించిందని గుర్తించిన పిల్లలు భయంతో పారిపోయారని అన్నారు. ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని అన్నారు.