వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

80 శాతం బాంబులు లక్ష్యాన్ని ఛేదించాయి.. ప్రభుత్వానికి శాటిలైట్ చిత్రాలు అందజేస్తామన్న ఐఏఎఫ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : పాకిస్థాన్ లోని బాలాకోట్ లో వైమానిక దళం చేసిన దాడులపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వాయుసేన దాడులు నిజమా ? అని విపక్షాలతో సహా ప్రపంచ మీడియా ప్రశ్నిస్తోంది. ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో రుజువుతో సమాధానం ఇవ్వాలని ఐఏఎఫ్ భావిస్తోంది.

శాటిలైట్ చిత్రాలు అందజేస్తాం

శాటిలైట్ చిత్రాలు అందజేస్తాం

ఫిబ్రవరి 26 తెల్లవారుజామున 3.30 గంటల మొదలైన వాయుసేన దాడులు 21 నిమిషాల్లో ముగిసాయి. భారత్ దాడి తర్వాతే పాకిస్థాన్ కూడా ధీటుగా స్పందించింది. ఈ అంశాన్ని విస్మరించి .. ఆరోపణలు రావడంతో బాలాకోట్ దాడికి సంబంధించి శాటిలైట్ చిత్రాలు ప్రభుత్వానికి అందజేయాలని భావిస్తోంది. ఈ చిత్రాలే సాక్ష్యాలుగా పరిగణించాలని, ఐఏఎఫ్ ఉన్నతాధికారులు చెప్తున్నారు.

అవి ఎలా ఉంటాయంటే ?

అవి ఎలా ఉంటాయంటే ?

ఆ శాటిలైట్ చిత్రాలు హై రిజల్యూషన్ తో ఉంటాయని, వాటిని రాడర్ ఇమేజరీ ద్వారా ఇంటెలిజెన్స్ ఎయిర్ క్రాప్ట్ సేకరించిందని ఐఏఎఫ్ వర్గాలు పేర్కొన్నాయి. త్వరలో వీటిని నరేంద్రమోదీ ప్రభుత్వానికి ఐఏఎఫ్ బృందం అందజేస్తోంది.

<strong>కాల్పుల విరమణ ఒప్పందానికి యధేచ్చగా తూట్లు .. పాక్ కాల్పులు .. తిప్పికొట్టిన భద్రతాదళాలు </strong>కాల్పుల విరమణ ఒప్పందానికి యధేచ్చగా తూట్లు .. పాక్ కాల్పులు .. తిప్పికొట్టిన భద్రతాదళాలు

80 శాతం లక్ష్యాల ఛేదన

80 శాతం లక్ష్యాల ఛేదన

బాలాకోట్ లోని ఉగ్ర వాద శిబిరంపై దాడి తర్వాత పాకిస్థాన్ దాడి జరగలేదని పేర్కొన్నది. కానీ చెట్లు, అటవీప్రాంతంలో బాంబులేసిన ఆనవాళ్లు ఉన్నాయని బుకాయిచింది. అలాగే అంతర్జాతీయ మీడియా కూడా జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరంపై దాడి జరిగినట్టు నిర్ధారించలేదు. దీంతో మీడియా ప్రతినిధులు వాయుసేన ఉన్నతాధికారులను ప్రశ్నించడంతో శాటిలైట్ చిత్రాలను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. దీంతోపాటు వైమానిక దళం చేసే దాడుల్లో 80 శాతం లక్ష్యాన్ని నిర్దేశిస్తాయని స్పష్టంచేశారు. 20 శాతం దాడులు మాత్రం అప్పుడప్పుడు గురితప్పుతాయని పేర్కొన్నారు. దీంతో తమ దాడులు నిజమని మరోసారి తేల్చిచెప్పారు. దీంతోపాటు శాటిలైట్ చిత్రాలతో దాడులకు సంబంధించిన ఊహాగానాలకు చెక్ పడే అవకాశం ఉంది.

English summary
the Indian Air Force is learnt to have provided the government with proof that it hit targets in Pakistan's Balakot during the February 26 airstrike. The IAF has told the government that 80 per cent of the bombs deployed during the daring raid hit their intended targets, top sources within the service told . The Indian Air Force has prepared a dossier to refute the theory that the bombs missed their target. Pakistan has claimed that the bombs led to no significant damage except to trees and forest land. International media too have cast doubt on whether the Balakot airstrike caused any damage. However, international media have not been able to access the Jaish-e-Mohammad terror camp that was targetted in the Balakot airstrike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X