80 మంది మృతి: శ్రామిక్ రైళ్లలో పయనించిన కార్మికుల మృత్యువాత..
లాక్డౌన్ వల్ల ఆయా చోట్ల చిక్కుక్కొన్న వలసకూలీలను తరలించేందుకు రైల్వేశాఖ శ్రామిక్ రైళ్లను నడిపిస్తోంది. స్వస్థలాలకు రైళ్లు చేరుస్తోన్నా.. కూలీల చనిపోవడం కలచివేస్తోంది. ఈ నెల 9వ తేదీ నుంచి 27వ తేదీ వరకు 80 మంది కార్మికులు చనిపోయారని రైల్వేశాఖ తెలిపింది. చనిపోయిన 80 మంది వివరాలను అధికారులు ప్రకటించారు.
గుంటూరులో కరోనా కలకలం: ఇద్దరు అటెండర్లకు సోకిన వైరస్, 190 కుటుంబాల ఆందోళన...
80 మందిలో ఒకరు కరోనా వైరస్ సోకిందని.. 11 మంది అనారోగ్యంతో మృతిచెందారని తెలిపారు. ఈ నెల 23వ తేదీన 10 మంది, 24, 25వ తేదీల్లో 9 మంది, 27వ తేదీన 8 మంది, 26వ తేదీన 13 మంది చనిపోయారని తెలిపారు. అలా మొత్తం 80 మంది చనిపోయారని పేర్కొన్నారు.
వలసకూలీల కోసం రైల్వేశాఖ మే 1వ తేదీ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. లక్షలాది మందిని స్వస్థలాకు తరలిస్తోన్నా.. కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. బీహర్, పశ్చిమబెంగాల్, ఒడిశాకు ఎక్కువమంది కూలీలను తరలించారు. ఇటీవల ఓ రైలు చేరాల్సిన గమ్యం కాకుండా ఒడిశాకు తీసుకెళ్లడంతో కూలీలు ఆందోళన చెందిన సంగతి తెలిసిందే. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 1 లక్ష 73 వేలకు చేరింది. 4900 మంది చనిపోగా.. 82 వేల మంది కోలుకున్నారని వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది.