నో ఫెసిలిటీస్.. నో అడ్మిషన్స్, 800 ఇంజినీరింగ్ కాలేజీలు మూసివేత!
వచ్చే విద్యా సంవత్సరం నుంచి దేశ వ్యాప్తంగా 800 ఇంజినీరింగ్ కాలేజీలను మూసి వేస్తున్నట్టు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ అనిల్ దత్తాత్రేయ వెల్లడించారు.
బెంగళూరు: వచ్చే విద్యా సంవత్సరం నుంచి దేశ వ్యాప్తంగా 800 ఇంజినీరింగ్ కాలేజీలను మూసి వేస్తున్నట్టు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ అనిల్ దత్తాత్రేయ వెల్లడించారు.
కాలేజీలో మౌలిక వసతులను కల్పించడంలో యాజమాన్యాలు విఫలం కావడం, ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు లేకపోవడం తదితర కారణాల వల్లే ఆయా కాలేజీల అనుమతులు రద్దు చేస్తున్నామని ఆయన చెప్పారు.
ఇప్పటికే ప్రతి ఏడాది 150 కాలేజీలు స్వచ్ఛందంగా మూత పడుతున్నాయని అనిల్ తెలిపారు. చాలా కాలేజీల్లో 30 శాతం కన్నా తక్కువ అడ్మిషన్లు జరుగుతున్నాయని చెప్పారు.
2014-15 నుంచి 2017-18 అకడమిక్ సంవత్సరం అనంతరం 410 కాలేజీలను మూసివేస్తున్నట్లు ఏఐసీటీఈ అధికారికంగా తన వెబ్సైట్లో ప్రకటించింది. వాటిలో 20 కాలేజీలు కర్ణాటకలో ఉండగా, మిగతావి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్లలో ఉన్నాయి.