తాగుబోతు తండ్రికి మద్యం ఎర, విద్యార్థినిపై గ్యాంగ్ రేప్, పుట్టింటిలో తల్లి, కామాంధుల అరాచకం !
చెన్నై: తాగుబోతు తండ్రికి మద్యం ఎరవేసిన కామాంధులు అతని కుమార్తె మీద సామూహిక అత్యాచారం చేసిన ఘటన తమిళనాడులోని ఈ రోడ్ జిల్లాలో జరిగింది. తండ్రి స్నేహితులు గత కొంత కాలంగా సామూహిక అత్యాచారం చెయ్యడంతో తీవ్ర అనారోగ్యానికి గురైన విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. విషయం తెలుసుకున్న స్థానికులు కామాంధుల్లోని ఓ వ్యక్తి ఇల్లు ధ్వంసం చేశారు. 9వ తరగతి విద్యార్థిని మీద అత్యాచారం చేసిన కామాంధుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాలిక తల్లి పుట్టింటిలో ఉండటంతో కామాంధుల రెచ్చిపోయారు.
ఆన్ లైన్ లో డీలింగ్, బెంగళూరు అమ్మాయిలకు భలే గిరాకి, చెన్నై అపార్ట్ మెంట్ లో హైటెక్ వ్యభిచారం!
పుట్టింటిలో భార్య
తమిళనాడులోని ఈరోడ్ జిల్లా గోపిచెట్టి పాళయం సమీపంలోని కూగలూరు ప్రాంతంలో కుమార్, బేబి దంపతులు నివాసం ఉంటున్నారు. కుమార్, బేబి దంపతులకు 14 ఏళ్ల కుమార్తె, 8 ఏళ్ల కుమారుడు ఉన్నారు. కొంత కాలంగా దంపతుల మధ్య మనస్పర్థల కారణంగా బేబి పుట్టింటికి వెళ్లిపోయింది. కుమార్ తోనే అతని కుమార్తె, కుమారుడు నివాసం ఉంటున్నారు.
తాగుబోతు తండ్రి
భార్య బేబి పుట్టింటికి వెళ్లిపోవడంతో అడిగేవారు లేక కుమార్ పత్రినిత్యం విచ్చలవిడిగా మద్యం తాగడానికి బానిస అయ్యాడు. తండ్రి తెచ్చే చాలిచాలని తిండితింటూ అతని కుమార్తె, కుమారుడు జాతీయ బాలకార్మికుల నిర్మూలనా కేంద్రంలో చదువుకుంటున్నారు.
తండ్రికి మద్యం ఎర వేసిన కామాంధులు
కుమార్ ఇంటి సమీపంలో అరుణాచలం, మయిల్ స్వామి అనే కామంధులు నివాసం ఉంటున్నారు. కుమార్ కుమార్తె మీద అరుణాచలం, మయిల్ స్వామి కన్ను వేశారు. తాగుబోతు తండ్రి కుమార్ కు మద్యం ఎర వేసిన కామాంధులు అతని కుమార్తెను బెదిరించి కొంతకాలం నుంచి ఆమెపై సామూహిక లైంగిక దాడి చేస్తున్నారు.
చంపేస్తామని బెదిరించి !
కుమార్ కు అవసరం అయినప్పుడు మద్యం తాగడానికి డబ్బులు ఇస్తున్న అరుణాచలం, మయిల్ స్వామి గురువారం రాత్రి కూడా అతని కుమార్తె మీద సామూహిక లైంగిక దాడి చేశారు. విషయం బయటకు చెబితే నీ తండ్రి, తమ్ముడిని, నిన్ను చంపేస్తామని అరుణాచలం, మయిల్ స్వామి బాలికను బెదిరించారు.
కామాంధుడి ఇల్లు ధ్వంసం
మరుసటి రోజు ఉదయం స్కూల్ కు వెళ్లిన బాలిక అక్కడే కుప్పకూలిపోయింది. స్కూల్ టీచర్లు బాలికను ఆసుపత్రికి తరలించారు. బాలిక మీద లైంగిక దాడి జరిగిందని, అందుకే అనారోగ్యానికి గురైయ్యిందని వైద్యులు చెప్పారు. బాలికను గట్టిగా ప్రశ్నించగా కామాంధుల విషయం వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న స్థానికులు మయిల్ స్వామి ఇంటిని ధ్వంసం చేశారు. బాలిక ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసిన పోలీసులు కామాంధులు అరుణాచలం, మయిల్ స్వామి కోసం గాలిస్తున్నారు. తాగుబోతు తండ్రి కుమార్ ను స్థానికులు పట్టుకుని చితకబాదేశారు.