కోల్కతాలో ప్రమాదం.. 9 మంది సిబ్బంది దుర్మరణం, రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా
పశ్చిమ బెంగాల్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. న్యూ కొయిలాఘాట్ భవనంలో మంటలు చెలరేగాయి. బహుళ అంతస్తుల మంటలు విరజిమ్మడంతో ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మంటల్లో 9 మంది సిబ్బంది చనిపోయారు. వీరిలో 4 అగ్నిమాపక సిబ్బంది. ఇద్దరు ఆర్పీఎఫ్ జవాన్లు, ఒకరు ఎఎస్సై ఉన్నారు. ప్రమాద స్థలంలో బీతావాహ పరిస్థితి నెలకొంది.
పరిస్థితిని మంత్రి సుజిత్ బోస్, జాయింట్ సీపీ మురళిధర్, కోల్ కతా సీపీ మిత్ర దగ్గరుండి సమీక్షిస్తున్నారు. మంటలు ఆర్పే సమయంలో ఇబ్బంది తలెత్తిందని.. చిన్న ఇరుకైన ప్రదేశానికి రాడర్ వెళ్లలేకపోతుందని మంత్రి బోస్ తెలిపారు. ఘటనాస్థలానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఘటన దురదృష్టకరం అని అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థికసాయం.. ఇంట్లో ఒకరికీ ప్రభుత్వ ఉద్యోగం అందజేస్తామని తెలిపారు.
ప్రమాదం వల్ల విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో ఈస్ట్రన్ ఇండియా ట్రైన్స్ టికెట్ బుకింగ్ నిలిపివేశారు. ఆ బిల్డింగ్లోనే ప్రమాదం జరగడంతో నిర్ణయం తీసుకున్నారు.