వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: తన చితికి తానే నిప్పంటించుకుని మహిళ ఆత్మహత్య

|
Google Oneindia TeluguNews

ముంబై: ఎంతో మనోవేదనకు గురై జీవితంపై విరక్తిచెందిన ఓ వృద్ధురాలు తన చితిని తానే పేర్చుకుంది. ఆ తర్వాత నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. కొల్హాపూర్‌ జిల్లాకి చెందిన కళవ్వ(90) అనే వృద్ధురాలు తన కుమారుడితో కలిసి ఉంటోంది. మంగళవారం రాత్రి భోజనం చేసి తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. గదిలో కట్టెలతో చితిని పేర్చి దానిపై కూర్చుంది. ఒంటినిండా కిరోసిన్‌ పోసుకుని నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకుంది.

 90-year-old Kolhapur woman sets herself on fire after building pyre

బుధవారం ఉదయం కళవ్వ మనవరాలు ఎంత తలుపుకొట్టినా ఆమె తెరవకపోవడంతో వెంటనే ఈ విషయాన్ని తండ్రి విఠల్‌కి చెప్పింది. విఠల్‌ చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు పగలగొట్టి చూసేసరికి దహనమై తన తల్లి శరీరాన్ని చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.

వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జీవితంపై విరక్తి కలగడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటన కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

English summary
A 90-year-old woman has allegedly committed suicide after building her own ‘pyre’ and sitting on it at her home in Kolhapur district of western Maharashtra, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X