ఉగ్రవాదంపై ఉక్కుపాదం.. 963 మందిని మట్టుబెట్టామన్న కేంద్రం
న్యూఢిల్లీ : ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్నామని కేంద్రం ప్రకటించింది. 2014 జూన్ నుంచి ఇప్పటివరకు 963 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు పేర్కొన్నది. ఏ రూపంలోనైనా తీవ్రవాదాన్ని సహించబోమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టంచేశారు. ఉగ్రవాదుల మట్టుబెట్టిన అంశానికి సంబంధించి ఇవాళ పార్లమెంట్కు అమిత్ షా లిఖితపూర్వకంగా వివరించారు.
413
మంది
సైనికుల
వీరమరణం
ఉగ్రవాదానికి
వ్యతిరేకంగా
ప్రభుత్వం
తీసుకుంటున్న
చర్యలను
పార్లమెంట్కు
తెలిపారాయన.
అయితే
ఉగ్రవాద
నియంత్రణ
చర్యల్లో
భాగంగా
413
మంది
సైనికులు
వీరమరణం
పొందినట్టు
పేర్కొన్నారు.
విధి
నిర్వహణలో
ఆసువులు
బాసిన
సైనికుల
కుటుంబాల
కోసం
సంక్షేమ
అధికారులను
నియమించారని
పేర్కొన్నారు.
వారు
బాధిత
కుటుంబాలకు
ప్రభుత్వం
నుంచి
వచ్చే
ప్రయోజనాలను
అందిస్తారని
వెల్లడించారు.
వారిని
అన్నిరకాలుగా
ఆదుకుంటామని
భరోసా
ఇచ్చారు.
వారి
పిల్లలకు
విద్య,
కుటుంబసభ్యులకు
మెరుగైన
వైద్యసేవలు
అందిస్తామని
ప్రకటన
చేశారు
అమిత్
షా.
అంతకుముందు పార్లమెంట్కు ప్రభుత్వం బాలాకోట్ దాడుల తర్వాత జరిగిన మార్పునకు సంబంధించిన నివేదికను అందజేసింది. ఇందులో ఇటీవల జరిపిన బాలాకోట్ దాడులను ప్రస్తావించింది. దీంతో చొరబాటుదారుల సంఖ్య 43 శాతం తగ్గిందని పేర్కొన్నది. భద్రతా బలగాలు తీసుకుంటున్న పటిష్ట చర్యల ఫలితంగా .. దేశంలో ఉగ్రవాద చర్యలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని వివరించారు. ఇక శాంతి భద్రతల విషయానికొస్తే .. ఈ జూన్ నాటికి కశ్మీర్లో పరిస్థితులు మెరుగుపడ్డాయని వివరించారు.