నేపాల్ టిక్టాక్ స్టార్ను కలిసేందుకు ఇంటినుండి పారిపోయిన ముంబయి యువతి... !
ముంబాయికి చెందిన 14 సంవత్సరాల యువతి తాను టిక్టాక్లో అభిమానించే, నేపాల్కు చెందిన 16 సంవత్సరాల టిక్టాక్ స్టార్ కోసం ఇల్లు విడిచి పారిపోయింది. బాలిక పారిపోయె సమయంలో తన తల్లిని భాధపడద్దోని , తనకోసం వెతక వద్దని, తండ్రీ వేధింపులు భరించలేక తాను అభిమానించే నేపాల్ ఉండే టిక్టాక్ స్టార్ దగ్గరికి వెళుతున్నానని ,ఇక ఇంటికి తిరిగి రానని లెటర్ రాసిపెట్టి పారిపోయింది.
నేపాల్ టిక్టాక్ స్టార్ను కలిసేందుకు
ముంబాయికి చెందిన 14 సంవత్సరాల యువతి తాను టిక్టాక్లో అభిమానించే, నేపాల్కు చెందిన 16 సంవత్సరాల టిక్టాక్ స్టార్ కోసం ఇల్లు విడిచి పారిపోయింది. బాలిక పారిపోయె సమయంలో తన తల్లిని భాధపడద్దోని , తనకోసం వెతక వద్దని, తండ్రీ వేధింపులు భరించలేక తాను అభిమానించే నేపాల్ ఉండే టిక్టాక్ స్టార్ దగ్గరికి వెళుతున్నానని ,ఇక ఇంటికి తిరిగి రానని లెటర్ రాసిపెట్టి పారిపోయింది.
యూత్లో టిక్టాక్ క్రేజ్...
యువతి యువకుల్లో టిక్టాక్ పాతుకుపోయిన విషయం తెలిసిందే.. దానిపై క్రేజ్ దేశవ్యాప్తంగా పాకిపోయింది. క్రేజ్తోపాటు అయితే అదే టిక్టాక్ అనేక దురదృష్ట పరిణామాలకు కూడ కారణమవుతోంది. దీంతో టీక్టాక్ యాప్ను కొద్ది రోజులు కొత్త యూజర్లకు నిషేధించే వరకు వెళ్లింది. ఇక తమిళనాడు టీక్టాక్ వాడకం పెద్ద ఆందోళన చేపట్టారు. ఇక తాజాగా టిక్టాక్ ప్రభావం మరో 14యెళ్ల మైనర్ బాలికపై పడింది.
టిక్టాక్ మోజులో పడి యువకులతో సహవాసం
ముంబాయికి చెందిన 14ఎళ్ల బాలిక తన సంతృప్తికోసం టిక్టాక్ మోజులో పడి యువకులతో సహవాసం చేస్తుండడంతో బాలిక తండ్రి పలుమార్లు మందలించారు. యువకులతో స్నేహం పెంచుకోవద్దని సూచించారు. అయినా బాలిక మాత్రం తన పంతాన్ని వీడలేదు. దీంతో తండ్రి మరిన్ని అంక్షలు విధించారు. దీంతో తండ్రి ఆంక్షలను కాదని తాను ఇళ్లు విడిచి వెళ్లడానికి సిద్దమైంది. తాను టిక్టాక్లో అభిమానించే నేపాల్కు చెందిన స్టారర్ రియాజ్ అఫ్రీన్ను కలిసేందుకు వెళ్లింది.
ఇంటి నుండి వెళ్లిపోతూ ఎమోషనల్ లెటర్...
కాగా అమే వెళుతూ...తన తల్లికి ఓ ఎమోషనల్ లెటర్ కూడ రాసింది. అందులో ''అమ్మా నువ్ నేను వెళ్లిపోతున్నందుకు బాధపడకు ,నేను నాన్న పెట్టే అంక్షలు నేను భరించలేకపోతున్నాను. నేను వెళ్లిపోతున్నందుకు ఎలాంటీ అఘాయిత్యానికి పాల్పడకు అని రాసింది. మరోవైపు తాను ఎవరి కోసమే ఇల్లు విడిచి వెళ్లడం లేదని, అలా నువ్వు అలోచించకని రాసిపెట్టింది."
పారిపోయిన 8 గంటల్లో బాలికను పట్టుకున్న పోలీసులు
అయితే బాలిక లెటర్ రాసి ఇంటినుండి పారిపోయిన వెంటనే తేరుకున్న తల్లిదండ్రులు పోలీసులను అశ్రయించారు. దీంతో పోలీసులు బాలిక వెతకడంతో పారిపోయిన ఎనిమిది గంటల్లోగా బాలికను పోలీసులు పట్టుకున్నారు.దీంతో ఆ బాలికను సురక్షితంగా ఇంటి చేర్చారు. కాగా టిక్టాక్ క్రేజ్తో మైనారీటీల వ్యక్తిగత సమాచారాన్ని కొంతమంది సేకరిస్తున్నారని దీంతో పిల్లలను ట్రాప్లో పడేస్తున్నారని పోలీసులు తెలిపారు.