కిరాతకం:శరీరంపై బ్లేడ్లతో గాయపర్చి, కళ్ళు పీకేసి,బాలికను ఏం చేశారంటే?
అభం శుభం తెలియని 14 ఏళ్ళ చిన్నారిని కిడ్నాప్ చేసి బాలిక మేనత్తే తీవ్రంగా చిత్రహింసలు పెట్టింది. ఆ బాలిక శరీరంపై బ్లేడులతో గాయపర్చింది.కళ్ళ గుడ్లు పీకేసింది.
బెంగుళూరు:ఓ మేనత్త తన మేన కోడలును స్కూల్ నుండి కిడ్నాప్ చేసి తీవ్రంగా గాయపర్చింది. కళ్లు పీకేసి, శరీరంపై బ్లేడులతో గాయపర్చింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకొంది.
కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ కు సమీపంలోని సాధాగల్లీ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ళ బాలిక 9వ, తరగతి చదువుతోంది. ఆమె మేనత్త మునియమ్మ అలియాస్ అన్నపూర్ణ అనే మహిళ ఈ బాలికకు మేనత్త అవుతోంది.
పాఠశాలలో ఉన్న బాలికను ఆమె మేనత్త అన్నపూర్ణమ్మ ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్ళింది. ఊరికి దూరంగా నిర్మానుష ప్రదేశంలో ఉన్న పాడుబడిన భవనంలోకి బాలికను తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టింది.
ఆ బాలిక శరీరంపై బ్లేడులతో తీవ్రంగా గాయపర్చింది. అంతేకాదు ఆ బాలిక కళ్ళలో పిన్నులు గుచ్చి కనుగుడ్లు తీసేసింది. తీవ్రగాయాల పాలైన ఆ బాలిక అరుపులు విన్న కొందరు ఆటోడ్రైవర్లు బాలికను ఆసుపత్రిలో చేర్చారు.
అయితే బాలికపై మేనత్త ఎందుకు ఈ రకమైన దారుణాలకు పాల్పడిందనే విషయాలు మాత్రం బయటకు రావాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.