వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరాతకం:శరీరంపై బ్లేడ్లతో గాయపర్చి, కళ్ళు పీకేసి,బాలికను ఏం చేశారంటే?

అభం శుభం తెలియని 14 ఏళ్ళ చిన్నారిని కిడ్నాప్ చేసి బాలిక మేనత్తే తీవ్రంగా చిత్రహింసలు పెట్టింది. ఆ బాలిక శరీరంపై బ్లేడులతో గాయపర్చింది.కళ్ళ గుడ్లు పీకేసింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు:ఓ మేనత్త తన మేన కోడలును స్కూల్ నుండి కిడ్నాప్ చేసి తీవ్రంగా గాయపర్చింది. కళ్లు పీకేసి, శరీరంపై బ్లేడులతో గాయపర్చింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకొంది.

కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ కు సమీపంలోని సాధాగల్లీ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ళ బాలిక 9వ, తరగతి చదువుతోంది. ఆమె మేనత్త మునియమ్మ అలియాస్ అన్నపూర్ణ అనే మహిళ ఈ బాలికకు మేనత్త అవుతోంది.

పాఠశాలలో ఉన్న బాలికను ఆమె మేనత్త అన్నపూర్ణమ్మ ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్ళింది. ఊరికి దూరంగా నిర్మానుష ప్రదేశంలో ఉన్న పాడుబడిన భవనంలోకి బాలికను తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టింది.

a 14 years old girl kidnap and harassed.

ఆ బాలిక శరీరంపై బ్లేడులతో తీవ్రంగా గాయపర్చింది. అంతేకాదు ఆ బాలిక కళ్ళలో పిన్నులు గుచ్చి కనుగుడ్లు తీసేసింది. తీవ్రగాయాల పాలైన ఆ బాలిక అరుపులు విన్న కొందరు ఆటోడ్రైవర్లు బాలికను ఆసుపత్రిలో చేర్చారు.

అయితే బాలికపై మేనత్త ఎందుకు ఈ రకమైన దారుణాలకు పాల్పడిందనే విషయాలు మాత్రం బయటకు రావాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.

English summary
a 14 years old girl kidnap and harassed,annapurna harassed her dauther in law .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X