గుడికి వెళుతున్న యువతిని అడ్డగించిన దుండగులు.. మద్యం మత్తులో అత్యాచారం..!
తన స్నేహితులతో కలిసి గుడి వెళుతున్న 15 ఏళ్ల యువతిని ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి దారుణంగా కొట్టారు.. అనంతరం అజ్ఝాత స్థలానికి తీసుకు వెళ్లి అత్యాచారం చేశారు. సంఘటనకు పాల్పడిన వ్యక్తులు భయపడి పారిపోయారు . దీంతో ఆమే వెంట ఉన్న స్నేహితుడు సంఘటన స్థలానికి చేరుకుని ఆమేను రక్షించారు.
గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి.. ప్రకాశం బ్యారేజీలో యువకుడు.. చివరకు సేఫ్గా..!
గుడికి వెళుతున్న యువతిని అడ్డగించిన దుండగులు
రాజస్థాన్లో మరోసారి దారుణమైన సంఘటన చోటుచేసుకోంది. ఓ పదిహేనెళ్ల యువతి తన ఇద్దరు స్నేహితులతో కలిసి గుడికి వెళుతోంది. దీంతో మద్యం మత్తులో ఉన్న యువతిపై ముగ్గురు వ్యక్తులు వారిని అడ్డగించారు. ఈనేపథ్యంలోనే వారిపై దాడి చేశారు. దీంతో యువతితో ఉన్న ఇద్దరు స్నేహితులు తలోదిక్కు పారిపోయార. దీంతో ఒంటరిగా యువతిని అక్కడి నుండి ఎత్తుకెళ్లారు. అనంతరం అత్యాచారం కొనసాగించారు. ఈ సంఘటన జైపూర్కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న భిల్వారా జిల్లాలో జరిగింది.
యువతిని కాపాడిన షాపు యజమాని
ఈ నేపథ్యంలోనే యువతితో ఉన్న ఇద్దరు స్నేహితులు అక్కడే ఉన్న మార్కెట్ వైపు పారిపోయారు. మార్కెట్లో ఉన్న రంగ్రెజ్ అనే షాపు యజమానితో జరిగిన విషయం చెప్పారు.. ఆనంతరం షాపు యజమానితో కలిసి ఇద్దరు కలిసి యువతిని తీసుకెళ్లిన ప్రాంతం వైపు వెళ్లడంతో యువతిని ఎత్తుకెళ్లిన ముగ్గురు వ్యక్తులు ఆమే కొడుతుండడం చూసినట్టు రంగ్రెజ్ పోలీసులకు తెలిపాడు. అయితే అప్పటికే భయంతో ఉన్న యువతి స్నేహితుడి నుండి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఆమేపై అత్యాచారం చేసినట్టు పోలీసులు తెలిపారు.దీంతో వారిని చూసిన దుండగులు ముగ్గరు పారిపోయారు
భయంతో నగ్నంగా పరుగెత్తిన యువతి
అయితే యువతి దగ్గరికి చేరిన స్నేహితులతో పాటు షాప్ యజమాని అయిన రంగ్రెజ్ కూడ యువతి నమ్మలేదు. దీంతో భయపడి అక్కడి ఆమే ఒంటిమీద బట్టలు లేకుండానే సుమారు అరకిలోమీటరు పారిపోయినట్టు రంగ్రేజ్ తెలిపాడు.అయితే అర కిలోమీటరలు పరుగెత్తిన తర్వాత ఆగియన యువతికి నెమ్మదిగా తాను రక్షించడానికి వచ్చానని ఒప్పించడానికి ప్రయత్నించాడు. అనంతరం తన ఒంటిమీద ఉన్న బట్టలు తీసి ఆమేకు ఇచ్చినట్టు చెప్పాడు.కాగా గాయల పాలైన ఆమేను ఆసుపత్రికి వెళ్లేందుకు యువతి నిరాకరించింది. తన తండ్రి ఆనారోగ్యంగా ఉన్నాడని తిరిగి ఇంటికి వెళదామని చెప్పింది. దీంతో ఆమే తన బైక్పై ఇంటికి తీసుకువెళ్లినట్టు రంగ్రెజ్ పోలీసులకు తెలిపాడు. కాగా విషయం తెలిసిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.