15 ఏళ్ల బాలుడు 21 ఏళ్ల యువతిపై అత్యాచారం... చేశాడంటూ కేసు... !!
యువతి యువకులు ఇష్టపడి తల్లిదండ్రులకు చెప్పకుండా పారిపోతారు. అనంతరం ఎలాంటీ ఇబ్బందులు లేకుండా ఉంటే అలాగే కంటిన్యూ అవుతారు. లేదంటే ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుని బయటకు వచ్చేస్తారు. ఏది అలోచించకుండా పారిపోయి అసలు విషయం బోధపడ్డ తర్వాత కేసులు పెట్టుకుంటున్న సంఘటనలు ప్రస్తుత సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇలాంటీ కేసుల్లో అత్యాచారాల కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. ఈనేపథ్యంలోనే ఓ 21 ఏళ్ల అమ్మాయి 15 ఏళ్ల అబ్బాయి తనపై అత్యాచారం చేశారని కేసు నమోదు చేసింది.
చంఢిగడ్కు చెందిన 21ఏళ్ల యువతి పదిహేనేళ్ల అబ్బాయి తనను నమ్మించి అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మైనర్ బాలున్ని జువైనల్ జైలు పంపించారు. అయితే ఈ సంఘటన నమ్మశక్యంగా లేకపోవడంతో బాలుడి తల్లితండ్రులు రంగంలోకి దిగారు. యువతి చేస్తున్న ఆరోపణలపై వారు స్పందించారు.
యువతి యువకులు ఇద్దరికి ఒకరికొకరు తెలుసని , వారిద్దరు ఇష్టపడి కలిసి ఇంటినుండి ముంబయికి పారిపోయారని , అయితే వారితో ఇరువురు కుటుంబసభ్యులు మాట్లాడి ఒప్పించారని అనంతరం తిరిగి ఇంటికి తీసుకువచ్చారని చెప్పారు. ఈ సంఘటన జరిగి నెల రోజులు గడుస్తోంది. అయితే ఇద్దరిని ఒప్పించి ఇంటికి తీసుకువచ్చిన తర్వాత యువతి తల్లిదండ్రులు మైనర్ బాలుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. అయితే యువతి ఫిర్యాదు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.