పితృదేవో భవ, నేనే కోడుకు ,నేనే కూతురు
కోల్కతాకు చెందిన 19 సంవత్సరాల యువతి తన తండ్రి ప్రాణాలు కాపాడుకునేందుకు తన శరీరంలోని 65 శాతం మేర లీవర్ ను తండ్రికి దానంగా ఇచ్చింది. దీంతో ఈమే నిర్ణయాన్ని ప్రంశసిస్తూ ప్రముఖ పారీశ్రామిక వేత్త హర్ష్ గోయోంకా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.దీంతో నెటిజన్లు ఆమే సహసానికి ఫిదా అవుతున్నారు.
మేము సైతం కుటుంభ బాద్యతలు మోస్తం
ప్రస్తుత రోజుల్లో అడవారు అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్న విషయం తెలిసిందే ..సామాజిక రంగాలతోపాటు కుటుంభ బాధ్యతలోను సగం పంచుకుంటున్నారు. కన్న తల్లిదండ్రులకు సైతం తామే అమ్మ,నాన్న అవుతున్నారు. తాజగా కోల్కతాకు చెందిన యువతి తన తండ్రికి లివర్ లో సగభాగం ఇచ్చి ఆయనకు పునర్జన్మనిచ్చింది..
తండ్రికి, 65 శాతం కాలేయన్ని దానంగా ఇచ్చిన యువతి
కోల్కతాకు చెందిన 19 ఏళ్ల రాఖీ దత్తా తండ్రి కాలేయ వ్యాధితో గత కొద్ది రోజులుగా బాధపడుతున్నారు. దీంతో కాలేయ మార్పిడి చేస్తే గాని బ్రతికే అవకాశాలు లేవని వైద్యులు తేల్చారు. ఇక చేసేదేమి లేక రాఖీదత్త దైర్యంగా తన కాలేయాన్ని పంచేందుకు సిద్దమైంది. దీంతో 65 శాతం కాలేయాన్ని తన తండ్రికి దానం చేసి బ్రతికించుకుంది.
రాఖీ సాహసాన్ని ప్రశంసించిన హర్ష్ గోయంకా
అయితే రాఖీ చేసిన సహసాన్ని పారిశ్రామివేత్త హర్ష్ గోయెంకా ట్వీట్ చేశారు. నోప్పి తోపాటు కత్తిగాట్లు భవిష్యత్ లో ప్రమాదాల గురించి ఆలోచించకుండా తన కాలేయాన్ని తండ్రికి ఇచ్చింది. ఇది తండ్రి పట్ల కూతురు చూపించే ప్రేమ చాల ప్రత్యేకం అంటూ ,కూతుళ్లు ఎందుకూ పనికిరారు అని అనుకునేవారికి ఈమే సరైన సమాధానం అంటూ ట్వీట్టర్ లో పేర్కోన్నారు. దీంతో పాటు ట్విట్టర్ లో ఆమే సహసాన్ని స్వాగతించారు. ప్రశంసలు కురిపించారు. మరోవైపు తండ్రి కూతుళ్ల ఫోటోను కూడ షేర్ చేశారు.దీంతో ఇది వైరల్ అవుతోంది.