గర్భంతో ఉన్న కూతురును నరికి చంపిన తండ్రి...ఎందుకు చంపాడో తెలుసా...?
సమాజంలో రోజురోజుకు పరువు హత్యలు పెరిగిపోతున్నాయి. గతంలో కులాలు, మతాంతర వివాహాలు చేసుకున్నారని సమాజంలో పలువురు దాడి చేసేవారు..ప్రస్థుతం స్వంత తల్లితండ్రులే తమ పిల్లలపై దాడులకు దిగుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా హత్యలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రేమ వివాహాలు చేసుకోవడంతో పాటు తాను చెప్పినట్టు వినని కూతుర్లపై హత్యలకు పాల్పడుతున్న సంఘటనలు రోజురోజుకు పెరిగి పోతుండడంతో భవిష్యత్లో ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో అనే అందోళన పలువురు అమ్మాయిల్లో కల్గుతోంది.
ముంబాయిలో పరువు హత్య
ఇలాంటీ పరువు హత్యే ముంబాయిలో ఘట్కాపోర్ ప్రాంతంలో జరిగింది. కన్న తండ్రి పెళ్లై ప్రెగ్నేన్సితో ఉన్న తన 20 యెళ్ల కూతురును దారుణంగా హత్య చేశాడు. కూతురు పెళ్లి సంబంధాలు తెచ్చిన నిరాకరించడంతో నిరాశకు గురయ్యాడు. అనంతరం ఇంట్లో తెలియకుండా ప్రేమికున్ని పెళ్లి చేసుకోవడంతో పగ పెంచుకున్నాడు.ఈ నేపథ్యంలోనే గత ఫిబ్రవరిలో మీనాక్షీ చౌరాసియా అనే యువతి తన తండ్రికి ఇష్టం లేకుండా స్థానకంగా ఉండే బ్రిజేష్ చౌరాసియా అనే యువకున్ని ప్రేమ వివాహం చేసుకుంది. తన మాట వినలేదని కక్ష పెంచుకున్న తండ్రి రాజ్ కుమార్ ఆమేను హత్య చేసేందుకు కుట్ర చేశాడు. పెళ్లయిన కొద్ది నెలల తర్వాత బట్టలు కొనిస్తానని ఇంటికి పిలిచాడు.
నమ్మించి...డబ్బులు క్రిందపడేసి,
ఈనేపథ్యంలోనే తన ఇంట్లో కావాలనే డబ్బలు క్రింద పడేశాడు. వాటిని తీసి ఇవ్వాలని కూతురుతో చెప్పాడు. దీంతో తండ్రి కుట్రను గ్రహించలేని కూతురు గర్భంతో ఉన్నా కూడ డబ్బులు తీసేందుకు క్రిందకు వంగింది. వెంటనే రాజ్కుమార్ ఆమే మెడపై కత్తితో వేటు వేశాడు. దీంతో ఆమే అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం తండ్రి పారిపోయాడు. రాజ్కుమార్ ఫోన్ సిగ్నల్ ద్వార పట్టుకుని అరెస్ట్ చేశారు పోలీసులు.
కన్న కూతుళ్లనే హత్య చేస్తున్న ఉదంతాలు
ఇటివల తాను చెప్పినట్టు వినడం లేదని, కుటుంభ సభ్యులు సూచించిన పెళ్లిళ్లను చేసుకోలేదనే కారణంతో తమ స్వంత కూతురు అని కూడ చూడకుండా అమ్మాయిలను హత్య చేసిన సంఘటనలు చేటుకుంటున్నాయి.ఇటివల తెలంగాణలోని యాదాద్రీ జిల్లాకు చెందిన ఓ తండ్రి తన పరువు కోసం కూతురినే బలితీసుకున్నాడు. అంతకు ముందు కూడ నల్గోండ జిల్లాలో సైతం మారుతిరావు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలన రేపిన విషయం తెలిసిందే...