బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

lockdown:లాక్ డౌన్ తో పుట్టింటికి వెళ్లిన తల్లి,ఇంట్లో నుంచి బాలుడిని ఎత్తుకెళ్లి చంపి తినేసిన చిరుత

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారితో ఎక్కడ మా ప్రాణాలు పోతాయో అని ప్రజలు హడలిపోతున్నారు. కరోనా వైరస్ తో పాటు మృత్యువు అనేక రూపాల్లో ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నది. లాక్ డౌన్ తో ఎలాంటి పనులు లేకపోవడంతో తల్లి కుటుంబ సభ్యులతో కలిసి పుట్టింటికి వెళ్లింది. వేడి ఎక్కువగా ఉండటంతో రాత్రి ఇంటి తలుపులు తీసి నిద్రపోతున్న సమయంలో ఇంట్లో ఉన్న బిడ్డను చిరుత ఎత్తుకెళ్లి చంపి తినేసింది. రాత్రి బిడ్డ కనపడలేదని బాలుడి కోసం గాలించడంతో చిరుత చంపి తినేసిన విషయం వెలుగు చూసింది. ఐటీ, బీటీ సంస్థల రాజధాని బెంగళూరు నగరం సమీపంలోనే ఈ సంఘటన జరగడంతో ప్రజలు హడలిపోతున్నారు.

Lockdown: లవ్ మ్యారేజ్, కేరళలో భర్త, బెడ్ రూంలో ప్రియుడు, కరోనా పరీక్షలు చేసిన గంటలో ఫినిష్ !Lockdown: లవ్ మ్యారేజ్, కేరళలో భర్త, బెడ్ రూంలో ప్రియుడు, కరోనా పరీక్షలు చేసిన గంటలో ఫినిష్ !

 ఒక్కడే కొడుకు

ఒక్కడే కొడుకు

కర్ణాటకలోని రామనగర జిల్లాలో చంద్రప్ప, మంగళగౌరమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. చంద్రప్ప, మంగళగౌరప్ప దంపతులకు హేమంత్ (3) అనే కుమారుడు ఉన్నాడు. ఒక్కగానఒక్క కొడుకు కావడంతో హేమంత్ ను చంద్రప్ప, మంగళగౌరప్ప దంపతులు అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు.

 పుట్టింటికి వెళ్లిన తల్లి

పుట్టింటికి వెళ్లిన తల్లి

మంగళగౌరమ్మ తల్లిదండ్రులు రామనగర జిల్లా మాగడి తాలుకా కదిరయ్యనపాళ్య (బెంగళూరు శివార్లు)లో నివాసం ఉంటున్నారు. లాక్ డౌన్ అమలులో ఉన్న సందర్బంగా ఎలాంటి పనులు లేకపోవడంతో మంగళగౌరమ్మ భర్త చంద్రప్ప, కుమారుడు హేమంత్ ను పిలుచుకుని వారం రోజుల క్రితం కదిరయ్యనపాళ్యలోని పుట్టింటికి వెళ్లింది.

 రాత్రి విపరీతమైన వేడి

రాత్రి విపరీతమైన వేడి

కొన్ని రోజుల నుంచి పగలు ఎండ, రాత్రి విపరీతమైన వేడి ఉండటంతో రామనగర ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం రాత్రి వేడి ఎక్కువగా ఉండటంతో చంద్రప్ప, మంగళగౌరమ్మ దంపతులు కొడుకు హేమంత్ తో కలిసి భోజనం చేసిన తరువాత ఇంటి తలుపులు తీసి నిద్రపోయారు.

ఇంట్లో దూరి బాలుడికి ఎత్తెకెళ్లిన చిరుత

ఇంట్లో దూరి బాలుడికి ఎత్తెకెళ్లిన చిరుత

అర్దరాత్రి చంద్రప్ప, మంగళగౌరమ్మ దంపతులు గాఢడనిద్రలో ఉన్నారు. తల్లిదండ్రుల పక్కనే హేమంత్ నిద్రపోయాడు. అర్దరాత్రి దాటిన తరువాత ఇంట్లోకి చొరబడిన చిరుత గాఢనిద్రలో ఉన్న హేమంత్ పీక పట్టుకుని ఇంట్లో నుంచి బయటకు లాక్కెళ్లింది. చిరుత ఇంట్లోకి వచ్చి కొడుకును ఎత్తుకెళ్లిన విషయం గాఢనిద్రలో ఉన్న చంద్రప్ప, మంగళగౌరమ్మ దంపతులు, చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారు గమనించలేకపోయారు.

Recommended Video

Pubs, Bars, Clubs And Restaurants Can Sell Liquor, Conditions Applied
 బాలుడిని చంపి తినేసిన చిరుత

బాలుడిని చంపి తినేసిన చిరుత

కదిరయ్యనపాళ్య గ్రామానికి సుమారు 60 మీటర్ల దూరం బాలుడిని ఎత్తుకెళ్లిన చిరుత అతన్ని చంపి తినేసింది. బాలుడి శరీరం దాదాపుగా తినేసిన చిరుత అక్కడి నుంచి వెళ్లిపోయింది. నిద్రపోతున్న తల్లిదండ్రులకు మెలుకువ రావడంతో కొడుకు కోసం చీకట్లో గాలించారు. గ్రామానికి 60 మీటర్ల దూరంలో బాలుడు అర్థ శరీరం చిక్కడంతో తల్లిదండ్రులు ఆర్తనాదాలు చేశారు. పరిసర ప్రాంతాల్లోని అటవి ప్రాంతం నుంచి చిరుత వచ్చి ఇంతకు ముందు పశువులు, మేకలు, గొర్రెలను చంపి తిన్నాయని, ఇప్పుడు మనుషుల మీద పడ్డాయని స్థానిక గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

English summary
Bengaluru: A 3 year old boy was mauled to death , apparently by a leapard in a village in Ramanagara.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X