ఆ విషయంలో చైనా-భారత్ బలగాలు ఒక్కటయ్యాయి: ఇండియాకు థ్యాంక్స్
భారత్ - చైనా బలగాలు ఒక విషయంలో ఏకమయ్యాయి. అరేబియా సముద్రంలో దొంగల బారి నుంచి వాణిజ్య నౌకలను కాపాడేందుకు రెండు దేశాల నావికాదళాలు సంయుక్తంగా చర్యలు చేపట్టాయి.
ఢిల్లీ: భారత్ - చైనా బలగాలు ఒక విషయంలో ఏకమయ్యాయి. అరేబియా సముద్రంలో దొంగల బారి నుంచి వాణిజ్య నౌకలను కాపాడేందుకు రెండు దేశాల నావికాదళాలు సంయుక్తంగా చర్యలు చేపట్టాయి.
మలేషియాలోని కెలాంగ్కు పోర్ట్ఆఫ్ అడెన్కు మధ్య ప్రయాణిస్తున్న ఒక భారీ వాణిజ్య నౌకపై సముద్ర దొంగలు దాడి చేశారు. దీనిని రక్షించేందుకు ఐఎన్ఎస్ ముంబై, ఐఎన్ఎస్ తారక్ష్ రంగంలోకి దిగాయి.
చైనాకు అలవాటే: దలైలామా, మోడీపై ప్రశంస, ట్రంప్పై ఆగ్రహం
ది యునైటెడ్ కింగ్డమ్ ట్రేడ్ ఆర్గనైజేషన్(యుకేఎంటీవో) నుంచి వచ్చిన సమాచారం మేరకు ఈ నౌకలు రంగంలోకి దిగాయి. ఇది దాదాపు 21,000 కి.మీ. మేరకు సముద్రాన్ని పరిశీలిస్తుంటుంది.
ఈ మార్గాన్ని చైనా, ఇటలీ, పాకిస్థాన్కు చెందిన నౌకలు కూడా పరిరక్షిస్తుంటాయి. ఈ దేశాల నౌకలు కూడా స్పందించాయి. కానీ భారత నావికాదళం వేగంగా స్పందించి సదరు వాణిజ్య నౌకకు ఒక హెలికాప్టర్ను పంపించింది.
అదే సమయంలో చైనాకు చెందిన ప్రత్యేక బలగాలు నౌకలోకి ప్రవేశించి సముద్ర దొంగల కోసం గాలింపు చేపట్టాయి. దీంతో సముద్రదొంగలు పరారయ్యారు. ఈ సందర్భంగా చైనా బలగాలు.. భారత బలగాలకు కృతజ్ఞతలు తెలిపాయి.