ప్రేమ పెళ్లి, దంపతులపై దాడి, ఇద్దరికీ మూత్రం తాగించిన యువతి కుటుంబ సభ్యులు !
హరదాస్ పుర: కుటుంబ సభ్యులను ఎదిరించి పెళ్లి చేసుకున్నందుకు ప్రేమికులకు చిత్రహింసలు పెట్టారు. కుమార్తె అని కూడా చూడకుండా నగ్నంగా తయారు చేసి చితకబాదేశారు. యువకుడిని నడి రోడ్డులో పట్టుకుని అతని మీద తీవ్రస్థాయిలో దాడి చేసి మూత్రం తాగించిన ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.
మధ్యప్రదేశ్ లోని హరదాస్ పురలో నివాసం ఉంటున్న యువతి, యువకుడు చాల కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటామని వారి కుటుంబ సభ్యులకు యువతి, యువకుడు చెప్పారు. పెళ్లి చేసుకోవడాని యువతి కుటుంబ సభ్యులు నిరాకరించారు.
ఇటీవల యువతి, యువకుడు పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుని కాపురం పెట్టి సంతోషంగా గడుపుతున్నారు. పెళ్లి చేసుకుని కాపురం పెట్టడంతో యువతి కుటుంబ సభ్యులు రగిలిపోయారు.
యువతి కుటుంబ సభ్యులు నవ దంపతులను నడి రోడ్డు మీదకు లాక్కొని వచ్చారు. ఇద్దరినీ ఇష్టం వచ్చినట్లు చితకబాదేశారు. కుమార్తె అనే కనికరం లేకుండా యువతి బట్టలు చింపేశారు. మమ్మల్ని ఎదిరించి పెళ్లి చేసుకుంటారా అంటూ యువతి, యువకుడి మీద దాడి చేశారు.
నవదంపతులకు బలవంతంగా మూత్రం తాగించిన కసాయివాళ్లు మీ అంతుచూస్తాం అంటూ వెళ్లి పోయారు. తాము ఇద్దరూ ప్రేమించుకుని జీవితాంతం కలిసి ఉండాలని పెళ్లి చేసుకున్నామని, యువతి కుటుంబ సభ్యులు ఇలా చిత్రహింసలు పెడుతున్నారని యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆరు మంది మీద కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి పరారైన నలుగురి కోసం గాలిస్తున్నారు.