పేరు ‘ఒసామా బిన్ లాడెన్’: ఐదుగురుని చంపింది.. ఎట్టకేలకు చిక్కింది, డ్రోన్లతో వేటాడారు
గౌహతి: వేలాది మంది ప్రాణాలు తీసిన అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ను అమెరికా సైన్యం మట్టుబెట్టిన విషయం తెలిసిందే. భారతదేశంలో కూడా ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడు. ఇక్కడి ప్రజల ప్రాణాలు తీస్తూ భయాందోళనలకు గురిచేసిన ఓ క్రూరమైన ఏనుగుకే ఇక్కడివారు ఆ పేరు పెట్టడం గమనార్హం.
అందుకే ఒసామా బిన్ లాడెన్
అసోంలోని గోల్పారా జిల్లాలోని అడవుల్లో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ఓ ఏనుగుకు ఇక్కడి ప్రజలు ‘ఒసామా బిన్ లాడెన్' అనే పేరు పెట్టారు. ఆ పేరు వింటేనే ఇక్కడి ప్రజలు హడలిపోతున్నారు. ఆ ఏనుగును పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు, ప్రజలు తీవ్రంగా ప్రయత్నించారు.
ఒక్కరోజే ఐదుగురి ప్రాణాలు తీసి..
ఓ రోజు రాత్రి ఆ ‘ఒసామా బిన్ లాడెన్' ఏనుగు ఐదుగురు గ్రామస్తుల ప్రాణాలు తీయడంతో ఈ ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. అంతేగాక, ఆ అటవీ ప్రాంతం గుండా రహదారిపై వెళ్లాలన్నా ప్రజలు, వాహనదారులు జంకుతున్నారు. దీంతో అటవీశాఖ అధికారులకు మొరపెట్టుకున్నారు. ఆ ఏనుగును ఎలాగైనా పట్టుకోవాలని.
డ్రోన్లతో వేట.. ఎట్టకేలకు
ఈ
క్రమంలో
ఆ
ఒసామా
బిన్
లాడెన్
ఏనుగును
పట్టుకునేందుకు
ఎనిమిదిమంది
అటవీశాఖ
అధికారులు
రంగంలోకి
దిగారు.
ఆ
ఏనుగును
పట్టుకునేందుకు
డ్రోన్లను
కూడా
ఉపయోగించారు.
ఎట్టకేలకు
సోమవారం
ఆ
ఏనుగు
జాడ
కనుకున్నారు.
ఆ
తర్వాత
ఇద్దరు
నిపుణులు
ఆ
ఏనుగును
శాంతపర్చి..
రెండు
బాణాలతో
మత్తుమందిచ్చి
పట్టుకున్నారు.
జనావాసాలకు దూరంగా..
ఇప్పుడు ఆ ఏనుగును జనావాసాలకు దూరంగా.. పెద్ద అటవీ ప్రాంతంలో వదిలేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అక్టోబర్ నెలలో కేవలం 24 గంటల్లోనే ఆ ఒసామా బిన్ లాడెన్ ఏనుగు గోల్పారా జిల్లాలో ఐదుగురు గ్రామస్తుల ప్రాణాలు తీసింది. ఈ ఏనుగు దాడిలో మరణించినవారిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. కాగా, గత ఐదేళ్లలో ఏనుగుల దాడిలో మనదేశంలో సుమారు 2300 మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. అదే సమయంలో 2011 నుంచి 700 ఏనుగులు కూడా చంపివేయబడ్డాయి.