తరచుగా రేప్ చేస్తున్నాడు: తండ్రిపై టీచర్కు పిర్యాదు
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకున్న దిగ్ర్భాంతికర ఘటన ఒకటి వెలుగు చూసింది. తన తండ్రే తనపై ఆరేళ్ళుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడని, అది చూసి కూడా తల్లి తనకు సహకరించడం లేదని ఓ బాలిక తను రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. తన పాఠశాల టీచర్కి ఈ మేరకు ఆమె లేఖ రాసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న 13ఏళ్ల బాలికపై ఆమె తండ్రి ఆత్యాచారానికి పాల్పడ్డాడు. తనకు ఏడేళ్ల వయస్సున్నప్పటి నుంచి తండ్రి తనపై ఈ దారుణానికి పాల్పడుతున్నాడని, తల్లి తనకు ఏవో మందులు ఇస్తోందని ఆ బాలిక వివరించింది.
తన సోదరులు ఇంట్లో లేని సమయంలో తల్లిముందే అత్యాచారానికి పాల్పడేవాడని బాలిక టీచర్కి రాసిన లేఖలో పేర్కొంది. ఆ లేఖ చూసిన ఉపాధ్యాయురాలు ఒక స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించారు. వారి సహాయంతో బాలిక తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు తల్లిదండ్రులిద్దరి మీదా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
బాలిక తండ్రిని అరెస్టు చేశారు. ఆ బాలికకు 17ఏళ్ల అక్క కూడా ఉందని, ఆమె కూడా ఒకప్పుడు తండ్రి చేతిలో బాధితురాలేనని పోలీసుల విచారణలో తేలింది. ఇప్పుడామె తల్లిదండ్రుల వద్ద ఉండటం లేదని చెప్పారు. కాగా, బాధిత బాలిక సంరక్షణ బాధ్యతను ఓ స్వచ్ఛంద సంస్థ తీసుకుంది.