పెళ్లికి రావాలంటూ ప్రధాని మోడీకి ఆహ్వానం పంపిన ఓ సామాన్యుడు.. రిప్లై చూసి....
సాధరణంగా కొంతమంది ప్రజలు తమ అభిమాన నాయకులు, హీరోలు తమ కుటుంభాల్లో జరిగే శుభకార్యాలకు రావాలని కోరుకుంటారు. ఇలా లక్షలాది మంది కోరుకుంటారు. కాని పెద్ద స్థాయిలో ఉన్నవారు మనం పిలిస్తే వస్తారా అనే మీమాంసలో పడిపోతారు. దీంతో కనీసం అహ్వానం పంపేందుకు కూడ వెనకాడతారు. కాని కొంతమంది మాత్రం వెనకడుకుగు వేయకుండా ప్రయత్నాలు చేస్తారు. దాన్ని సాకారం చేసుకుంటారు. తాను అభిమానించే నాయకులు వచ్చినా.. రాకున్న అహ్వానాన్ని మాత్రం పంపుతారు. అలా అహ్వానాన్ని పంపినప్పుడు అనుకోని అతిధులు వస్తే మాత్రం వారి సంతోషానికి మాత్రం అవధులు ఉండవు. వాళ్లకు అందరికన్నా ఆ అనుకొని అథిదే ముఖ్యంగా భావిస్తారు.
నేను కూడా ఫైన్ కట్టాను.. కొత్త మోటారు వాహన చట్టం ఫైన్లపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
ఇందులో భాగంగానే తమిళనాడులోని వెల్లూరుకు చెందిన రాజశేఖరన్ అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి తన కూతురు వివాహాన్ని సెప్టెంబర్ 11న నిశ్చయించాడు. పెళ్లికి బంధువులు, తెలిసిన వాళ్లతోపాటు ప్రధాని నరేంద్ర మోదీని సైతం ఆహ్వనించాడు. ఇందులో భాగంగా ప్రధానికి లేఖ రాశాడు. తన అభిమానికి లేఖ అయితే రాశాడు కాని ఆ తరువాత కుటుంబం పెళ్లి పనుల్లో మునిగిపోయారు.
కాని ఆ కుటుంభానికి అశ్చార్యాన్ని కల్గిస్తూ.. గత శనివారం ప్రధాని నరేంద్ర మోడీ నుండి రాజశేఖరన్ కుటుంబానికి లేఖ అందింది. ప్రధాని పంపిన లేఖలో మీ కుమార్తె వివాహం గురించి నాకు తెలియపరచడం నా అదృష్టంగా భావిస్తున్నా. మీ ఇంట్లో జరిగే శుభ సందర్భానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. నూతన వధువరులకు నా శుభాకాంక్షలు, కొత్త జంట ఎప్పుడు సుఖసంతోషాలతో పాటు ఆనందాలతో జీవించాలంటూ ప్రధాని తన లేఖలో ఆశీర్వదించారు.దీంతో ప్రధాని రాకున్నా తమకు లేఖ వచ్చినందుకు ఆ కుటుంభం అంతా ఆనందంలో మునిగిపోయారు. ఆయన బిజీలో ఉండి రాలేకపోయారని బావిస్తామని అన్నారు.దీంతో ప్రధాని పంపిణ లేఖను ఫ్రేమ్ కట్టించుకుంటామని తెలిపారు.