కూతురునే కాటేసిన తండ్రి... ! అత్యాచారం చేస్తున్నాడని కూతురు ఫిర్యాదు
మానవ సంబంధాలతో పాటు కుటుంభ బంధాలు రానురాను మంటగలిసి పోతున్నాయి. దేశంలో ఎవరికి ఏమవుతారో తెలియని వింత సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతుండడం ఆందోళన కల్గిస్తుంది. తల్లి, కూతురు,అక్క చెల్లి, ఇరుగు పోరుగు అనే బంధావ్యాలను కూడ జనం మరచిపోతున్న సంఘటనలు సమాజంలోని విపరీత పోకడలకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలోనే కన్న తండ్రే కూతురును కాటేశాడు. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన పిల్లల్ని భారంగా భావిస్తూ అత్యచారానికి పాల్పడ్డాడు. విశేషమిటంటే భర్త ఏం చేస్తున్నారో తెలిసి కూడ భార్య సహకరిస్తూ కూతురును అబార్షన్ కోసం మందులు తెచ్చించిన ఘొరమైన సంఘటన యూపిలో చోటు చోసుకుంది.
సభ్య సమాజాం తలదించుకునే సంఘటన లేక సమాజమే ఇలాంటీ ఆకృత్యాలకు సాక్షిభూతం అవుతుందని సిగ్గుపడాలో తెలియని సంఘటన యూపిలో చోటు చేసుకుంది. లక్నోకు సమీపంలోని చిన్హాట్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం కొనసాగిస్తున్నడంటూ 21 ఏళ్ల అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది. అయితే వాళ్లపై దశాబ్దకాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నట్టు తెలిపారు. అయితే ఇందుకు తల్లి కూడ సహకరించిందని తెలిపారు..దుర్మార్గం ఏంటంటే కూతుళ్లు గర్భవతులు కాకుండా మందులు తెచ్చివ్వడంతోపాటు, ఒకవేళ గర్భం దాల్చితే కూడ అబార్షన్ చేయించేదని పిర్యాధు చేశారు. దీంతో కేసును నమోదు చేసుకున్న పోలీసులు అమ్మాయిని మెజిస్ట్రేట్ ముందు హజరుపర్చి స్టేట్మెంట్ తీసుకున్నారు.
కాగా ఇంట్లొ తల్లితోపాటు ఇద్దరు తమ్ముళ్లు కూడ ఉన్నారని ఎవ్వరు కూడ వ్యతిరేకించలేదని పిర్యాధు లేఖలో పేర్కోన్నారు. ఇటివల విపరీతమైన మానసిక ఒత్తిడికి గురి చేశారని భాదితురాలి అక్క పోలీసులకు తెలిపింది. దీంతో స్థానిక ఎన్జీఓ సంస్థను సంప్రదించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎన్జీఓ సహకారంతో భాదితురాళ్లు పోలీసులను ఆశ్రయించారు. కాగా నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేశారు. దీంతో నిందుతుడు పరీలో ఉండడంతో నిందుతుడి భార్యను విచారిస్తున్నారు.