వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతంటే అంత చులకనా..! పలకరించడమే పాపమన్నట్టుగా..

|
Google Oneindia TeluguNews

దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఆసరా లేకుండా అయిపోతుంది. ఏ ప్రభుత్వ పథకాలు అన్నదాతల ఆకలిని తీర్చలేకపోతున్నాయి. తీవ్ర కరువుతో దేశంలొని రైతులంతా అల్లాడుతున్న వేళ.. పరిస్థితికి అద్దం పడుతూ దేశ రాజధాని ఢిల్లీలో, ప్లకార్డు చేతబట్టిన ఓ రైతు తనకు సహాయం చేయాల్సిందిగా ఢిల్లీ రోడ్ల వెంబడి కనిపించిన ప్రతీ ఒక్కరిని వేడుకుంటున్నాడు.

చిత్రంగా చాలామంది ఆ రైతును చూసీ చూడనట్టుగా వెళ్లిపోయారు తప్పిస్తే.. సహాయం కాదు కదా, కనీసం పలకరించే ప్రయత్నం కూడా ఎవరు చేయకపోవడం నిజంగా చింతించాల్సిన విషయం. దాదాపుగా 5 గంటల పాటు ఆ రైతు ఢిల్లీ రోడ్ల వెంట తిరిగితే.. అందరూ మాకెందుకు అన్నట్టుగానే రైతును దాటేసుకుంటూ వెళ్లిపోయారు. ఇక ఇండియా గేట్ వద్దనైతే అక్కడున్న పోలీసు బలవంతంగా రైతును అక్కడినుంచి పంపించేసే ప్రయత్నం చేశాడు.

a former placard show in delhi

కాగా.. కష్టాల్లో ఉన్న రైతుల పట్ల దేశ ప్రజలు ఏ మేరకు స్పందిస్తారో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో, ప్రయోగాత్మకంగా ఈ ప్రయత్నం చేశారు. కానీ రైతుల పట్ల జనాలు ఎంత చిన్న చూపుతో వ్యవహరిస్తున్నారో ఈ ప్రయోగంతో తేలిపోయింది. కాలే కడుపులతో గ్రామాల నుంచి వలసబాట పడుతున్న రైతులు కొందరైతే.. ఏదో భరోసా రాకపోదా అని ఇంకా ఆశగా ఎదురుచూస్తున్నవారు గ్రామాల్లో ఎంతోమంది. మరి ఇలాంటి రైతన్నలందరు సంతోషంగా ఉండే రోజు ఎప్పుడొస్తుందో..!

English summary
a former with placard in his hand ask for the support of country people to help them
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X