వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిటైడ్జ్ దంపతులపై దాడి: నగలు లూటీ

|
Google Oneindia TeluguNews

మండ్య: రిటైడ్ జడ్జ్ పై దాడి చేసి ఇల్లు లూటీ చేసిన సంఘటన కర్ణాటకలోని మండ్య సమీపంలో జరిగింది. మద్రాస్ హై కోర్టు న్యాయమూర్తిగా పని చేసి రిటైర్ అయిన శివప్ప (80) ఆయన భార్య విజయలక్ష్మి (70) తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

మండ్య జిల్లాలోని పాండవపుర తాలుకా పట్టసోమనహళ్ళి సమీపంలో శ్రీశైల శ్రీ కామాక్షి చంద్రమౌళి దేవాలయం సమీపంలో శివప్ప, ఆయన భార్య నివాసం ఉంటున్నారు. రాత్రి సుమారు 10 మంది దుండగులు శివప్ప ఇంటి దగ్గరకు వెళ్లారు.

A gang robbed Madras high court retired judge Shivappa house

కిటికి డ్రిల్స్ కత్తిరించి లోపలకి చోరబడ్డారు. అడ్డుకున్న శివప్ప, ఆయన భార్య విజయలక్ష్మి మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశారు. తరువాత విజయలక్ష్మి మెడలో ఉన్న మంగళసూత్రం, కమ్మలు, లాకర్ లో ఉన్న రూ. 20 లక్షల విలువైన బంగారు నగలు, నగదు లూటీ చేశారు.

తరువాత శివప్ప దంపతుల మీద దాడి చేసిన నిందితులు అక్కడి నుంచి పరారైనారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. గాయాలైన శివప్ప దంపతులను ఆసుపత్రికి తరలించారు.

English summary
A gang robbed Madras high court retired judge Shivappa house at pandavapura taluk of Mandya district in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X