ప్రభుత్వ స్కూల్ టీచర్ రాసలీలల వీడియోలు వైరల్, మాజీ విద్యార్థిని, పొలిటికల్ లీడర్స్ అండ, జెండా !
బెంగళూరు/ మైసూరు: ప్రభుత్వ పాఠశాల టీచర్ ఓ మాజీ విద్యార్థిని (ఓల్డ్ స్టూడెంట్)తో రాసలీలలు సాగిస్తున్ప వీడియో బయటకు రావడంతో కొన్ని గంటల్లో అది వైరల్ అయ్యింది. మాజీ విద్యార్థినితో రాసలీలలు సాగిస్తూ వీడియోలు బయటకురావడంతో ప్రభుత్వ స్కూల్ టీచర్ జెండా ఎత్తేశాడు. పొలిటికల్ లీడర్స్ అండతో ఇంత కాలం ఆ స్కూల్ టీచర్ ఆడిందే ఆటగా పాడిందే పాటగా తయారైయ్యింది. ఇప్పుడు ఏకంగా అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడని వెలుగు చూడటంతో ఆ స్కూల్ టీచర్ మీద విద్యాశాఖ అధికారులు సీరియస్ అయ్యారు.
14 ఏళ్ల బాలుడితో ముగ్గురు పిల్లల తల్లి రొమాన్స్, రాత్రి ఆ పని కోసం టార్చర్, గొంతు కోసి చంపేశాడు!
ప్రభుత్వ పాఠశాలలో టీచర్
కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలుకా రాంపుర ప్రభుత్వ పాఠశాలలో సిద్దరాజు ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తున్నాడు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం చేస్తున్న సిద్దరాజు ఎప్పుడు పడితే అప్పుడు స్కూల్ కు వెలుతున్నాడని, విద్యార్థులకు సక్రమంగా పాఠశాలు చెప్పడం లేదని తెలిసింది.
రాసలీలల వీడియోలు వైరల్
ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా ఉద్యోగం చేస్తున్న సిద్దరాజు ఓ యువతితో రాసలీలు సాగిస్తున్న సమయంలో తీసిన వీడియో సోమవారం సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది. సోషల్ మీడియాలో టీచర్ సిద్దరాజు, యువతి రాసలీలల వీడియో విడుదలైన వెంటనే అది కాస్తా వైరల్ అయ్యింది.
మాజీ విద్యార్థిని
ప్రభుత్వ పాఠశాలలో సిద్దరాజుతో పాటు రాసలీలల వీడియోలో ఉన్న యువతి ఎవరు ? అని కొందరు ఆరా తీశారు. రాసలీలల వీడియోలో సిద్దరాజు పాటు ఉన్న యువతి ఆయన దగ్గర చదువుకున్న మాజీ విద్యార్థిని ( ఓల్డ్ స్టూడెంట్) అని వెలుగు చూడటంతో అనేక మంది షాక్ కు గురైనారు.
రాజకీయ నాయకుల అండ !
అనేక మంది రాజకీయ నాయకులు, ప్రముఖులతో టీచర్ సిద్దరాజుకు దగ్గరి సంబంధాలు ఉన్నాయని వెలుగు చూసింది. టీడీ. జయకుమార్ మంత్రి అయిన వెంటనే ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా ఉద్యోగం చేసే సిద్దరాజు మంత్రిగారి పీఏ అయ్యారని సమాచారం. అంతే కాకుండా అనేక మంది రాజకీయ నాయకులతో సిద్దరాజు కలిసిమెలసి తిరిగారని మైసూరు జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు.
వీడియో వైరల్, టీచర్ మాయం
మాజీ విద్యార్థినితో సిద్దరాజు రాసలీలలు సాగిస్తున్న వీడియో వైరల్ కావడంతో ఆయన సన్నిహితులు హడలిపోయారు. రాసలీలల వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చిన తరువాత ప్రభుత్వ పాఠశాల టీచర్ సిద్దరాజు మాయం అయ్యారు. సిద్దరాజు వ్యవహారం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు సీరియస్ అయ్యారు. సిద్దరాజు మీద కఠిన చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.